ఈద్ అల్ ఫితర్: ఫ్లైదుబాయ్ ప్రత్యేక విమాన ప్యాకేజీలు
- April 08, 2023
యూఏఈ: దుబాయ్కి చెందిన విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్ రాబోయే ఈద్ అల్ ఫితర్ సెలవుల కోసం యూఏఈ నుండి ప్రయాణించే ప్రయాణీకుల కోసం ప్రత్యేక ఛార్జీలను ప్రకటించింది. ఏప్రిల్ 15, ఏప్రిల్ 23 మధ్య ట్రిప్ల కోసం 20 కంటే ఎక్కువ గమ్యస్థానాలకు ప్రోమో రేట్లను విడుదల చేసింది. ప్రత్యేక ఈద్ రిటర్న్ ఛార్జీలు Dh1,135 నుండి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 20లోపు బుకింగ్ చేసుకునే వారికి ఈ ప్రత్యేక ఛార్జీలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రమోషన్లో భాగమైన గమ్యస్థానాలలో ఇస్తాంబుల్, క్రాబీ, మిలన్-బెర్గామో, పట్టాయా, పిసా, సలాలా, సాల్జ్బర్గ్, టిబిలిసి ఉన్నాయి. అలాగే బ్లూ మస్జీదు, ఇస్తాంబుల్, టర్కీ, లేక్ కోమో, మిలన్, ఇటలీలోని మెనాగియో పట్టణం, క్రాబి, థాయిలాండ్ ఉన్నాయి. తమ నెట్వర్క్లో ఉన్న 110 కంటే ఎక్కువ గమ్యస్థానాలకు ప్రయాణీకులు బిజినెస్ లేదా ఎకానమీ క్లాస్లో ప్రయాణించి మెరుగైన ప్రయాణ అనుభవాన్ని ఆస్వాదించవచ్చని ఫ్లైదుబాయ్ ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







