రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపు
- May 08, 2016
విభజన తర్వాత రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని... ఇందులో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం ఈరోజు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... ప్రవాస భారతీయులు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా వారిని ఒప్పించాలని జయరాంను కోరారు. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల గురించి వివరించాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
తాజా వార్తలు
- జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- ఒమన్లో వరుస దాడులు
- ఖతార్ లోని ఇండస్ట్రియల్ ఏరాలో అగ్నిప్రమాదం..!!
- ప్రయాణికులు ఎమిరేట్స్ కీలక సూచనలు..!!
- బ్రేకింగ్: గల్ఫ్ దేశాల్లో రేపటి CBSE పరీక్షలు వాయిదా!
- మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ఉధృతి: విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక
- ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
- దుబాయ్ లో అడ్డగించిన డ్రోన్ల అవశేషాలు ఇళ్ల ఆవరణల్లో పడి ఇద్దరు గాయాలు
- ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు









