రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపు
- May 08, 2016
విభజన తర్వాత రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని... ఇందులో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం ఈరోజు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... ప్రవాస భారతీయులు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా వారిని ఒప్పించాలని జయరాంను కోరారు. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల గురించి వివరించాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







