సాంప్రదాయ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లు..!
- April 09, 2023
రియాద్: సౌదీ అరేబియాలో ఆటోమొబైల్ సప్లై కంపెనీలు, కార్ రెంటల్ కంపెనీల మధ్య మూడు ఒప్పందాలపై సంతకాల కార్యక్రమాన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (PTA) నిర్వహించింది. ఒప్పందంపై సంతకం చేసిన ఏడాదిలోగా అల్-మోఫ్తాకు 100 ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేసేందుకు నాఘి మోటార్స్ కంపెనీ, అల్-మోఫ్తా కార్ రెంటల్ కంపెనీ మొదటి ఒప్పందంపై సంతకాలు చేశాయి. బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేయడానికి అల్మాజ్డౌయ్ మోటార్స్ కంపెనీ, బడ్జెట్ రెంట్ ఎ కార్ కంపెనీ మధ్య రెండవ ఒప్పందం కుదిరింది. మూడవ ఒప్పందాన్ని యెలో రెంట్ ఎ కార్ కంపెనీతో అల్మాజ్డౌయ్ కంపెనీ కుదుర్చుకుంది. సాంప్రదాయ కార్లను ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కార్లతో భర్తీ చేయడం అద్దెకార్ల రంగం అభివృద్ధికి, ఆధునిక పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాలపై ఆధారపడటానికి తోడ్పడుతుందని, ఇది సేవల నాణ్యత, సామర్థ్యంలో క్వాంటం లీపుకు దోహదం చేస్తుందని PTA పేర్కొంది. పర్యావరణాన్ని పరిరక్షించడం, నాణ్యత స్థాయిని పెంపొందించడం, క్లీన్ ఎనర్జీపై ఆధారపడే ఆధునిక మార్గాలను.. నాణ్యమైన రవాణా పద్ధతులను అవలంబించడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ చేసిన ప్రయత్నాలకు అనుగుణంగా ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయని పీటీఏ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







