నేషనల్ చారిటీ క్యాంపెయిన్ కు కింగ్ సల్మాన్ ఆమోదం
- April 09, 2023
రియాద్: సౌదీ అరేబియా వార్షిక నేషనల్ చారిటీ క్యాంపెయిన్ కు రాజు సల్మాన్ ఆమోదించారు. సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) అభివృద్ధి చేసిన నేషనల్ ప్లాట్ఫారమ్ ఫర్ ఛారిటబుల్ వర్క్ (ఎహ్సాన్)ని ఉపయోగించి ప్రజలు విరాళం ఇవ్వడానికి ఈ క్యాంపెయిన వీలు కల్పిస్తుంది. SDAIA ప్రెసిడెంట్ అబ్దుల్లా బిన్ షరాఫ్ అల్- ఘమ్డి మాట్లాడుతూ.. ఆన్లైన్లో పొందుపరిచిన స్వచ్ఛంద సంస్థలకు తమ సహకారాన్ని అందించే దాతల విస్తృత విభాగానికి చేరుకోవడానికి ప్లాట్ఫారమ్ అప్గ్రేడ్ చేయబడిందన్నారు. "ప్లాట్ఫారమ్ విరాళాలను సేకరించడానికి, లబ్ధిదారులకు సహాయాన్ని అందించడానికి సురక్షితమైన, విశ్వసనీయ చెల్లింపు పద్ధతిని అందజేస్తుంది" అని అల్-ఘమ్డి తెలిపారు. ఇప్పటివరకు ప్లాట్ఫారమ్ $880 మిలియన్లకు పైగా వసూలు అయిందని, దీని వలన 4.8 మిలియన్ల మందికి పైగా ప్రయోజనం అందిందని తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









