హైదరాబాద్ లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన జూనియర్ డాక్టర్లు
- April 09, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఈనెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా అన్ని రకాల వైద్య సేవలను బహిష్కరిస్తామని గాంధీ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.ప్రభుత్వం తీరును నిరసిస్తూ శనివారం గాంధీ మెడికల్ కాలేజీ ఎదుట వారు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు.తమకు హైజీనిక్, సెక్యూరిటీతో కూడిన వసతిగృహాలను కేటాయించాలని, ఎన్ఎంసీ నోటిఫికేషన్, రాష్ట్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం జిల్లాల్లో పనిచేసే పీజీ డాక్టర్లకు ఆహార సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.గాంధీ జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ డాక్టర్ చిత్తర్వు కరిష్ని మాట్లాడుతూ....డిమాండ్లు పరిష్కరించాలి లేకపోతే ఈనెల 11 నుంచి డ్యూటీలు బహిష్కరిస్తామని తెలిపారు.ఈ ఆందోళనలో గాంధీ జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ డాక్టర్ చిత్తర్వు కరిష్ని, రాష్ట్ర జూనియర్ డాక్టర్ల జనరల్ సెక్రటరీ డాక్టర్ అఖిల్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కౌశిక్ జోషి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







