హైదరాబాద్ లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన జూనియర్ డాక్టర్లు
- April 09, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఈనెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా అన్ని రకాల వైద్య సేవలను బహిష్కరిస్తామని గాంధీ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.ప్రభుత్వం తీరును నిరసిస్తూ శనివారం గాంధీ మెడికల్ కాలేజీ ఎదుట వారు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు.తమకు హైజీనిక్, సెక్యూరిటీతో కూడిన వసతిగృహాలను కేటాయించాలని, ఎన్ఎంసీ నోటిఫికేషన్, రాష్ట్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం జిల్లాల్లో పనిచేసే పీజీ డాక్టర్లకు ఆహార సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.గాంధీ జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ డాక్టర్ చిత్తర్వు కరిష్ని మాట్లాడుతూ....డిమాండ్లు పరిష్కరించాలి లేకపోతే ఈనెల 11 నుంచి డ్యూటీలు బహిష్కరిస్తామని తెలిపారు.ఈ ఆందోళనలో గాంధీ జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ డాక్టర్ చిత్తర్వు కరిష్ని, రాష్ట్ర జూనియర్ డాక్టర్ల జనరల్ సెక్రటరీ డాక్టర్ అఖిల్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కౌశిక్ జోషి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









