హైదరాబాద్ లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన జూనియర్ డాక్టర్లు
- April 09, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఈనెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా అన్ని రకాల వైద్య సేవలను బహిష్కరిస్తామని గాంధీ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.ప్రభుత్వం తీరును నిరసిస్తూ శనివారం గాంధీ మెడికల్ కాలేజీ ఎదుట వారు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు.తమకు హైజీనిక్, సెక్యూరిటీతో కూడిన వసతిగృహాలను కేటాయించాలని, ఎన్ఎంసీ నోటిఫికేషన్, రాష్ట్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం జిల్లాల్లో పనిచేసే పీజీ డాక్టర్లకు ఆహార సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.గాంధీ జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ డాక్టర్ చిత్తర్వు కరిష్ని మాట్లాడుతూ....డిమాండ్లు పరిష్కరించాలి లేకపోతే ఈనెల 11 నుంచి డ్యూటీలు బహిష్కరిస్తామని తెలిపారు.ఈ ఆందోళనలో గాంధీ జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ డాక్టర్ చిత్తర్వు కరిష్ని, రాష్ట్ర జూనియర్ డాక్టర్ల జనరల్ సెక్రటరీ డాక్టర్ అఖిల్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కౌశిక్ జోషి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







