కువైట్ లో 115 మంది ప్రవాసులు అరెస్ట్
- April 09, 2023
కువైట్: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని అధికారులు వారాంతంలో చేపట్టిన మూడు భద్రతా ప్రచారాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఉల్లంఘనలకు సంబంధించి 115 మంది ప్రవాసులను అరెస్టు చేశారు. అధికారుల బృందం షువైఖ్ ఇండస్ట్రియల్, ఖురైన్ మార్కెట్లు, ముబారకియాలో కార్మికులు, యాచకులు, వీధి వ్యాపారులకు వ్యతిరేకంగా భద్రతా ప్రచారాలను నిర్వహించింది.
డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ వాలిద్ అల్-తరావా నేరుగా సూచనల మేరకు షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన ప్రచారంలో 18 మంది నివాస, పని చట్టాన్ని ఉల్లంఘించిన వారిని.. ఆర్టికల్ 20 (గృహ కార్మికుడు)తో పెడ్లర్లుగా పనిచేస్తున్న 6 మంది ఆసియా కార్మికులను అరెస్టు చేశారు. అలాగే ఖురైన్ మార్కెట్స్ ప్రాంతంలో నిర్వహించిన ప్రచారంలో లైసెన్స్ లేని సైట్లలో పనిచేస్తున్న 24 మంది రెసిడెన్సీ, లేబర్ చట్టాన్ని, కార్మికులను ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేశారు. డెలివరీ కంపెనీల్లో పనిచేస్తున్న 27 మంది కార్మికులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ముబారకియా మార్కెట్స్ ప్రాంతంలో చేపట్టిన భద్రతా ప్రచారంలో 40 మంది నివాస, కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేశారు. ఇందులో అధిక సంఖ్యలో వీధి వ్యాపారులు, ఉపాంత కార్మికులతో పాటు ఆర్టికల్ 20 ప్రకారం రెసిడెన్సీ పర్మిట్లను కలిగి ఉన్న కార్మికులు, మార్కెట్లలో పోర్టర్లుగా పనిచేస్తున్నారు. వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!







