2 మిలియన్ దిర్హామ్ విలువైన నకిలీ వస్తువులు రీసైకిల్
- April 10, 2023
అబుధాబి: 2022,2023 మొదటి త్రైమాసికంలో అబుధాబి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న Dh2 మిలియన్ల విలువైన అంతర్జాతీయ ట్రేడ్మార్క్ల 578 నకిలీ వస్తువులను రీసైకిల్ చేశారు. రీసైకిల్ చేసిన వాటిల్లో వైర్డు, వైర్లెస్ హెడ్ఫోన్ల వంటి అనేక స్మార్ట్ పరికరాలతో పాటు లేదర్ బ్యాగులు, బట్టలు, గడియారాలు, బెల్ట్లు, స్పోర్ట్స్ క్లాత్స్, లేదర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. రీసైక్లింగ్ కార్యకలాపాలలో నైపుణ్యం కలిగిన ష్రెడెక్స్ కంపెనీ, సంబంధిత ట్రేడ్మార్క్ యజమానుల ప్రతినిధుల సమక్షంలో అబుదాబి ఎయిర్పోర్ట్ కస్టమ్స్ సెంటర్ లాజిస్టిక్స్ జోన్లో పర్యావరణ, చట్టపరమైన అవసరాలను పూర్తి చేసిన తర్వాత రీసైకిల్ చేయలేని నకిలీ వస్తువులు నాశనం చేశారు. అబుధాబి కస్టమ్స్లోని సపోర్ట్ సర్వీసెస్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫహెద్ గరీబ్ అల్షమ్సీ మాట్లాడుతూ.. మేధో సంపత్తి హక్కుల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. నకిలీ వస్తువులను అడ్డుకోవడం ద్వారా సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థలను రక్షించడానికి అబుధాబి కస్టమ్స్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అధునాతన సాంకేతికతలతో తనిఖీ సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా మార్కెట్లకు కల్తీ వస్తువుల అక్రమ రవాణాను నిరోధించే ప్రయత్నాలను తీవ్రతరం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పర్యావరణాన్ని సంరక్షించడానికి నకిలీ వస్తువులను రీసైక్లింగ్ చేయడం ద్వారా యూఏఈలో వర్తించే పర్యావరణ పరిరక్షణ చట్టాలు, నకిలీ వస్తువుల ఉపయోగించడం ద్వారా జరిగే నష్టాలపై అవగాహన కల్పిస్తుందన్నారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









