విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ సమాధానం చెప్పాలి: ఏపీ పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు
- April 11, 2023
అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమాధానం చెప్పాలని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోందని, సుమారు 35 వేల ఎకరాల్లో విస్తరించిన విశాఖ ఉక్కును రక్షించుకునే బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ తీసుకొస్తుందన్నారు. త్వరలో రాహుల్ గాంధీ విశాఖలో పర్యటిస్తారని గిడుగు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.మీడియా సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









