వినియోగదారుల రక్షణ చట్టం ఉల్లంఘన.. OMR 23,000 జరిమానా, జైలు శిక్ష
- April 15, 2023
మస్కట్: సౌత్ అల్ బతినా గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ బార్కాలో వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు నిందితుడికి OMR 23,000 జరిమానా, ఒక నెల జైలు శిక్ష విధించారు. బార్కా విలాయత్లోని ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్ట్ ఇటీవలే రాయల్ డిక్రీ నంబర్ (66/2014) ద్వారా అందించబడిన వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు వాణిజ్య సంస్థకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. పారదర్శకత, విశ్వసనీయత , సేవల్లో లోపాలు, వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనల నేపథ్యంలో సంస్థ ప్రతినిధికి కోర్టు శిక్షలు ఖరారు చేసింది. బిల్డింగ్ మెటీరియల్స్, శానిటరీ వేర్లను కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత నిర్మాణ సామగ్రిని విక్రయించే రంగంలో పనిచేస్తున్న ఒక వాణిజ్య సంస్థపై బార్కాలోని వినియోగదారుల రక్షణ విభాగానికి అనేక ఫిర్యాదులు అందాయి. దీనిపై అడ్మినిస్ట్రేషన్ అవసరమైన చర్యలను చేపట్టింది. కేసు ఫైల్ను బార్కాలోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్కు రిఫర్ చేసింది. చట్టపరమైన విధానాలను పూర్తి చేసి, సమర్థ న్యాయస్థానానికి కేసును పంపింది. కోర్టు సంస్థ ప్రతినిధిని దోషిగా నిర్ధారించి శిక్షలు ఖరారు చేసింది.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







