ఉమ్మ్ రామూల్ ప్రాంతంలో అగ్నిప్రమాదం
- April 15, 2023
దుబాయ్: దుబాయ్లో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఉమ్మ్ రామూల్లో మంటలు చెలరేగిన ప్రదేశం నుండి నలుపురంగు పొగలు రావడాన్ని గమనించినట్లు స్థానికులు వెల్లడించారు. నివేదికల ప్రకారం.. క్లీనింగ్ మెటీరియల్ని కలిగి ఉన్న గిడ్డంగిలో అగ్నిప్రమాదం జరిగింది. ససమాచారం అందగానే స్పందించిన దుబాయ్ సివిల్ డిఫెన్స్ అత్యవసర విభాగం బృందం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టి.. మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4.55 గంటలకు జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలను నివాసితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. క్షణాల్లో అవి వైరల్ అయ్యాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









