ఉమ్మ్ రామూల్ ప్రాంతంలో అగ్నిప్రమాదం
- April 15, 2023
దుబాయ్: దుబాయ్లో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఉమ్మ్ రామూల్లో మంటలు చెలరేగిన ప్రదేశం నుండి నలుపురంగు పొగలు రావడాన్ని గమనించినట్లు స్థానికులు వెల్లడించారు. నివేదికల ప్రకారం.. క్లీనింగ్ మెటీరియల్ని కలిగి ఉన్న గిడ్డంగిలో అగ్నిప్రమాదం జరిగింది. ససమాచారం అందగానే స్పందించిన దుబాయ్ సివిల్ డిఫెన్స్ అత్యవసర విభాగం బృందం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టి.. మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4.55 గంటలకు జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలను నివాసితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. క్షణాల్లో అవి వైరల్ అయ్యాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







