అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తనకు ఆహ్వానం రాలేదు: తెలంగాణ గవర్నర్
- April 15, 2023
హైదరాబాద్: శుక్రవారం హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్ సాగర్ తీరాన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని , ఆహ్వానం అందింతే తప్పకుండా వెళ్లేదాన్ని అన్నారు గవర్నర్ తమిళి సై. అంబేద్కర్ ఎక్కువగా మహిళల గురించి, మహిళల హక్కుల గురించి మాట్లాడారన్న ఆమె.. కానీ ఒక మహిళా గవర్నర్ కి ఆహ్వానం రాకపోవడం ఆశ్చర్యమని.. అందుకే రాజ్ భవన్ లోనే అంబేద్కర్ కు నివాళులు అర్పించానని తమిళ్ సై అన్నారు.
శనివారం తార్నాక లోని నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ , విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో జాతీయ పాలక మండలి సభ్యులు, విజ్ఞాన భారతి, కేఎస్ శాస్త్రి రచించిన స్వతంత్ర సమరంలో విజ్ఞాన శాస్త్రం అనే పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తో పాటు ICMR-NIN డైరెక్టర్ హేమలత హాజరయ్యారు. బ్రిటిష్ పరిపాలన కారణంగా దాగి ఉన్న చరిత్ర ఇప్పుడు ఓ పుస్తకం రూపంగా బయటికి రావడం సంతోషంగా ఉందని గవర్నర్ తమిళి సై అన్నారు. ఇలాంటి పుస్తకాలు యంగ్ పీపుల్ కి తెలియాలన్న ఆమె.. ఆదివాసుల ఆరోగ్యం కోసం ఐసీఎంఆర్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు







