టీటీడీ కీలక నిర్ణయాలు..
- April 15, 2023
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. వేసవి రద్దీ దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించామని వెల్లడించారు. టీటీడీ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. టీటీడీ అధికారులు మెంబర్ లతో కమిటీ వేశామని పేర్కొన్నారు.
అలిపిరి వద్ద ఉన్న టీటీడీ పురాతన గొడౌన్లు పునర్ నిర్మాణానికి రూ.18 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. తాతయ్య గుంట గంగమ్మ ఆలయం అభివృద్ధి పనులకు రూ.3.12 కోట్లతో టెండర్లు ఖరారు చేశామని పేర్కొన్నారు. టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసిన అనంతరం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.
ఢిల్లీలో వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మే 3 నుండి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలో శ్రీనివాస సేతు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మే నెలాఖరుకు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. శ్రీనివాస సేతుకు ఇప్పటివరకు రూ.287 కోట్లు నిధులు విడుదల చేశామని తెలిపారు.
అలాగే టీటీడీ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. విదేశీ కరెన్సీ స్వీకరించడానికి అనుమతులు వచ్చాయని తెలిపారు. చెల్లించిన రూ.3 కోట్ల పెనాల్టీ తిరిగి పొందే విధంగా కేంద్ర హోంమంత్రి సహకారంతో రీ ఫండ్ పొందటానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చంద్రబాబు ఇంటి పై పేర్ని నాని సంచలన ఆరోపణలు
- వెస్ట్ బెంగాల్: జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
- IPL 2026: పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
- ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ
- సింగపూర్లో మంత్రి లోకేష్..
- హనుమ జయంతి శుభాకాంక్షలు తెలిపిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
- మలేషియాలో ఘనంగా 'ఎన్టీఆర్ సజీవ చరిత్ర' పుస్తకావిష్కరణ
- రూపాయి పతనం..95.31కి పడిపోయిన భారత కరెన్సీ
- మచిలీపట్నం అభివృద్ధి అంశాల పై కేంద్ర కార్యదర్శితో ఎంపీ బాలశౌరి సమావేశం
- మాజీ IPS భార్య హత్య కేసులో కీలక పరిణామం..









