హైదరాబాద్ నుంచి మరో రెండు వందే భారత్ ట్రైన్లు
- April 16, 2023
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ట్రైన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటీకే తెలుగు రాష్ట్రాలు రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతుండగా..మరో రెండు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పూణె మధ్య వందే భారత్ ట్రైన్లను తీసుకరాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. త్వరలోనే వీటిని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో మూడు, నాల్గు నెలల్లో ఈ రెండు వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి తీసుకరాబోతుంది. ఈ రెండింటిలో ఒక ట్రైన్ కాచిగూడ-బెంగళూరు మధ్య ప్రయాణించనుండగా.. మరో ట్రైన్ సికింద్రాబాద్-పూణె మధ్య సర్వీసులు అందించనుంది. దక్షిణ మధ్య రైల్వేతో కలిసి భారతీయ రైల్వే ఈ రెండు సర్వీసులకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-బెంగళూరు రూట్ల మధ్య అనేక ట్రైన్లు ప్రయాణం సాగిస్తున్నాయి. వీటిల్లో 12 గంటల ప్రయాణ సమయం పడుతుంది. కానీ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ రెండు సిటీల మధ్య అందుబాటులోకి వస్తే కేవలం 8 గంటల్లోనే చేరుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ట్రైన్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తంది.
తాజా వార్తలు
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!







