హైదరాబాద్ నుంచి మరో రెండు వందే భారత్ ట్రైన్లు
- April 16, 2023
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ట్రైన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటీకే తెలుగు రాష్ట్రాలు రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతుండగా..మరో రెండు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పూణె మధ్య వందే భారత్ ట్రైన్లను తీసుకరాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. త్వరలోనే వీటిని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో మూడు, నాల్గు నెలల్లో ఈ రెండు వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి తీసుకరాబోతుంది. ఈ రెండింటిలో ఒక ట్రైన్ కాచిగూడ-బెంగళూరు మధ్య ప్రయాణించనుండగా.. మరో ట్రైన్ సికింద్రాబాద్-పూణె మధ్య సర్వీసులు అందించనుంది. దక్షిణ మధ్య రైల్వేతో కలిసి భారతీయ రైల్వే ఈ రెండు సర్వీసులకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-బెంగళూరు రూట్ల మధ్య అనేక ట్రైన్లు ప్రయాణం సాగిస్తున్నాయి. వీటిల్లో 12 గంటల ప్రయాణ సమయం పడుతుంది. కానీ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ రెండు సిటీల మధ్య అందుబాటులోకి వస్తే కేవలం 8 గంటల్లోనే చేరుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ట్రైన్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తంది.
తాజా వార్తలు
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!







