యజమాని కారుకు నిప్పు.. ఇద్దరికి జైలుశిక్ష, Dh66,000 జరిమానా
- April 16, 2023
దుబాయ్: మాజీ యజమాని కారుకు నిప్పుపెట్టిన ఇద్దరికి జైలుశిక్ష, Dh66,000 జరిమానాను కోర్టు విధించింది. ఈ ఘటనలో పార్కింగ్ స్థలంలో ఉన్న అనేక వాహనాలు కూడా దగ్ధం అయ్యాయి.కేసు ఫైల్ ప్రకారం, దుబాయ్ ఇన్వెస్ట్మెంట్స్ పార్క్ ప్రాంతంలోని ఇసుక యార్డ్లో బహుళ వాహనాలు అగ్నికి ఆహుతైనట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్స్ రూమ్కు కాల్ వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి, విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు.ఒక వాహనానికి ఉద్దేశ్యపూర్వకంగా నిప్పుపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు అనుమానితులను వారు గుర్తించారు.విచారణలో, అనుమానితుల్లో ఒకరు కారుకు నిప్పు పెట్టినట్లు అంగీకరించాడు. ఆ కారు గతంలో తన యజమానికి చెందినదని, అతను మద్యం అమ్మకాలు, పంపిణీ చేసేవాడని పేర్కొన్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో, యజమాని నిందితుడిపై దాడి చేసి పని నుంచి తొలగించాడు. దీనికి ప్రతీకారంగా మాజీ యజమాని కారుకు నిప్పు పెట్టాలని నిర్ణయించుకున్నాడు.బాధితుడు తన కారును ఇసుక యార్డ్లో పార్క్ చేయడం చూసిన ఇద్దరు అనుమానితులు.. కారుకు నిప్పు పెట్టారు. నేరం చేసిన తర్వాత వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. కేసు విచారించిన దుబాయ్ క్రిమినల్ కోర్టు ఇద్దరిని దోషులుగా నిర్ధారించి ఏడాది జైలు శిక్ష విధించింది. వారికి 66,000 దిర్హామ్ల జరిమానాతో పాటు శిక్షను అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







