దుబాయ్ అగ్నిప్రమాదం: మృతుల్లో నలుగురు భారతీయులు

- April 17, 2023 , by Maagulf
దుబాయ్ అగ్నిప్రమాదం: మృతుల్లో నలుగురు భారతీయులు

దుబాయ్ : అల్ రస్ లోని ఓ నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగి 16 మంది మరణించిన విషయం తెలిసిందే. మృతులలో నలుగురు భారతీయులు, ఆరుగురు సూడాన్ పౌరులు, ముగ్గురు పాకిస్తానీలు, ఒక కామెరూన్ జాతీయుడు, ఒక జోర్డానియన్ మరియు ఒక ఈజిప్టు ప్రవాసుడు ఉన్నారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. మృతిచెందిన భారతీయుల్లో కేరళకు చెందిన భార్యాభర్తలు, మరో ఇద్దరు తమిళనాడు వ్యక్తులు ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించారు. స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాలను భారత్‌కు పంపేందుకు ప్రక్రియలను చేపట్టినట్లు ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com