స్నేహితులు, బంధువులను ఎయిర్పోర్టులో డ్రాప్ చేస్తే.. ఇకపై నో ఫైన్
- April 17, 2023
మస్కట్: స్నేహితులను విమానాశ్రయానికి తీసుకెళ్లే లేదా వారి ప్రైవేట్ వాహనాల్లో సరుకులను డెలివరీ చేస్తున్న ప్రవాసులపై జరిమానాలు విధించినట్లు వచ్చిన ఆరోపణలపై రవాణా, కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MoTCIT) స్పందించింది. “ఇటీవల భూ రవాణాపై తనిఖీ ప్రచారాలు విస్తృతం చేశాము. నిబంధనల అమలులో భూ రవాణా వినియోగదారుల భద్రత, వస్తువుల భద్రత, భూ రవాణా పార్టీల హక్కులను సంరక్షించడం తమ బాధ్యత. భూ రవాణా చట్టంలోని కార్యనిర్వాహక నిబంధనల నిబంధనలను ఉల్లంఘించే డ్రైవర్లకు మాత్రమే జరిమానా విధించాలని తనిఖీ బృందాలను ఆదేశించాం. ఎటువంటి ఆర్థిక ప్రతిఫలం లేకుండా తమ పరిచయస్తులు, స్నేహితులను రవాణా చేసే డ్రైవర్లకు ఎలాంటి ఫైన్ వేయొద్దని ఆదేశించాం.’’ అని మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రజలు తమ స్నేహితులు లేదా బంధువులను రవాణా చేస్తున్నప్పుడు జరిమానా విధిస్తే.. వారి ఫిర్యాదులను అది జారీ చేసిన తేదీ నుండి 15 రోజులలోపు మంత్రిత్వ శాఖ జనరల్ ఆఫీస్లోని భూ రవాణా శాఖ లేదా గవర్నరేట్లోని రోడ్స్ డిపార్ట్మెంట్లో సమీక్ష కోసం సమర్పించవచ్చని సూచించింది.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









