ఉత్సాహంగా ప్రారంభమైన పిచ్వాయి, తంజోర్, గోండు చిత్ర లేఖన సదస్సు
- April 17, 2023
విజయవాడ: పిచ్వాయి, తంజోర్, గోండు చిత్ర లేఖన అభిమానులకు వినూత్న అవకాశాన్ని కల్పిస్తూ క్రియేటివ్ సోల్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమని మాలక్ష్మి గ్రూపు సిఇఓ సందీప్ మండవ అన్నారు. ఇతర రాష్ట్రాల కళలను తెలుగు ప్రజలకు పరిచయం చేసేలా నగరంలోని కల్చరల్ సెంటర్ ఆప్ విజయవాడ, అమరావతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వర్క్ షాపును సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ విజయవాడ ప్రజలు ఎప్పుడు కళలకు మంచి ప్రోత్సాహకులుగా ఉన్నారని, ప్రత్యేకించి యువత ఉత్సాహంగా ముందుకు రావటం అభినందనీయమన్నారు. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ కళలకు తగిన ప్రోత్సాహం అందిస్తుందన్నారు. క్రియెటివ్ సోల్ వ్యవస్దాపకులు సుమన్ మీనా, నేహా జైన్ మాట్లాడుతూ పిచ్వాయి, తంజోర్, గోండు చిత్రలేఖనంలో ఆరితేరిన శిక్షకుల ద్వారా వర్క్ షాపును నిర్వహిస్తున్నామన్నారు. నగర ప్రజల సందర్శనార్ధం ప్రత్యేక ప్రదర్శనను కూడా అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. ఉధయం 10 నుండి 12గంటల వరకు గోండు, మద్యాహ్నం మూడు నుండి ఐదు వరకు తంజోర్, సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు పిచ్వాయి చిత్రలేఖనంపై అభ్యాసం ఉంటుందన్నారు. శిక్షణకు అవసరం అయిన పూర్తి సామాగ్రిని క్రియేటివ్ సోల్ సమకూర్చుతుందని, ఇందుకోసం నామమాత్రపు రుసుము చెల్లించవలసి ఉంటుందని, 23వ తేదీ వరకు వర్క్ షాపు జరుగుతుందని వివరించారు. ఆసక్తిగలవారు 7893911717, 8008268885 నెంబర్లలో సంప్రదించవచ్చని, వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా అభ్యసించవచ్చని సుమన్ మీనా, నేహా జైన్ తెలిపారు.


తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









