దుబాయ్ అగ్నిప్రమాదం: భారతీయుల కుటుంబాలకు రూ.1 మిలియన్ పరిహారం
- April 18, 2023
యూఏఈ: దుబాయ్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మరణించిన ఇద్దరు భారతీయుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం రూ.1 మిలియన్ (45,000 దిర్హామ్లు) ప్రకటించింది. శనివారం దుబాయ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు తమిళనాడు వాసులు మరణించారనే వార్త తెలిసి చాలా బాధపడ్డానని, యూఏఈలోని భారత రాయబార కార్యాలయం మృతదేహాలను తమిళనాడుకు తరలిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. శనివారం అల్ రాస్లోని నివాస భవనంలో చెలరేగిన అగ్ని ప్రమాదంలో ఇమామ్ కాసిమ్ (43), ఎస్ మహ్మద్ రఫీక్ (49) సహా 16 మంది మరణించిన విషయం తెలిసిందే. మరోవైపు మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపిన దుబాయ్లోని భారత కాన్సులేట్.. మృతదేహాలను స్వదేశానికి తరలించింది. ఇదే దుర్ఘటనలో మరో ఇద్దరు భారతీయులు చనిపోయారు. దుబాయ్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసే కేరళలోని మలప్పురానికి చెందిన జేషి కందమంగళత్, ఆమె భర్త రిజేష్ కలంగదన్లు కూడా ఇదే ప్రమాదంలో మరణించారు. ఇప్పటికే వీరి మృతదేహాలను కేరళకు తరలించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







