దుబాయ్ అగ్నిప్రమాదం: భారతీయుల కుటుంబాలకు రూ.1 మిలియన్ పరిహారం

- April 18, 2023 , by Maagulf
దుబాయ్ అగ్నిప్రమాదం: భారతీయుల కుటుంబాలకు రూ.1 మిలియన్ పరిహారం

యూఏఈ: దుబాయ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మరణించిన ఇద్దరు భారతీయుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం రూ.1 మిలియన్ (45,000 దిర్హామ్‌లు) ప్రకటించింది. శనివారం దుబాయ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు తమిళనాడు వాసులు మరణించారనే వార్త తెలిసి చాలా బాధపడ్డానని, యూఏఈలోని భారత రాయబార కార్యాలయం మృతదేహాలను తమిళనాడుకు తరలిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. శనివారం అల్ రాస్‌లోని నివాస భవనంలో చెలరేగిన అగ్ని ప్రమాదంలో ఇమామ్ కాసిమ్ (43), ఎస్ మహ్మద్ రఫీక్ (49) సహా 16 మంది మరణించిన విషయం తెలిసిందే. మరోవైపు మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపిన దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌.. మృతదేహాలను స్వదేశానికి తరలించింది. ఇదే దుర్ఘటనలో మరో ఇద్దరు భారతీయులు చనిపోయారు. దుబాయ్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేసే కేరళలోని మలప్పురానికి చెందిన జేషి కందమంగళత్, ఆమె భర్త రిజేష్ కలంగదన్‌లు కూడా ఇదే ప్రమాదంలో మరణించారు. ఇప్పటికే వీరి మృతదేహాలను కేరళకు తరలించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com