దుబాయ్ అగ్నిప్రమాదం: భారతీయుల కుటుంబాలకు రూ.1 మిలియన్ పరిహారం
- April 18, 2023
యూఏఈ: దుబాయ్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మరణించిన ఇద్దరు భారతీయుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం రూ.1 మిలియన్ (45,000 దిర్హామ్లు) ప్రకటించింది. శనివారం దుబాయ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు తమిళనాడు వాసులు మరణించారనే వార్త తెలిసి చాలా బాధపడ్డానని, యూఏఈలోని భారత రాయబార కార్యాలయం మృతదేహాలను తమిళనాడుకు తరలిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. శనివారం అల్ రాస్లోని నివాస భవనంలో చెలరేగిన అగ్ని ప్రమాదంలో ఇమామ్ కాసిమ్ (43), ఎస్ మహ్మద్ రఫీక్ (49) సహా 16 మంది మరణించిన విషయం తెలిసిందే. మరోవైపు మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపిన దుబాయ్లోని భారత కాన్సులేట్.. మృతదేహాలను స్వదేశానికి తరలించింది. ఇదే దుర్ఘటనలో మరో ఇద్దరు భారతీయులు చనిపోయారు. దుబాయ్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసే కేరళలోని మలప్పురానికి చెందిన జేషి కందమంగళత్, ఆమె భర్త రిజేష్ కలంగదన్లు కూడా ఇదే ప్రమాదంలో మరణించారు. ఇప్పటికే వీరి మృతదేహాలను కేరళకు తరలించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- భారత్తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- క్రిటికల్ కేసుల రవాణాకు కొత్త టెక్నాలజీ..SQUH
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు







