దుబాయ్ అగ్నిప్రమాదం: భారతీయుల కుటుంబాలకు రూ.1 మిలియన్ పరిహారం
- April 18, 2023
యూఏఈ: దుబాయ్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మరణించిన ఇద్దరు భారతీయుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం రూ.1 మిలియన్ (45,000 దిర్హామ్లు) ప్రకటించింది. శనివారం దుబాయ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు తమిళనాడు వాసులు మరణించారనే వార్త తెలిసి చాలా బాధపడ్డానని, యూఏఈలోని భారత రాయబార కార్యాలయం మృతదేహాలను తమిళనాడుకు తరలిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. శనివారం అల్ రాస్లోని నివాస భవనంలో చెలరేగిన అగ్ని ప్రమాదంలో ఇమామ్ కాసిమ్ (43), ఎస్ మహ్మద్ రఫీక్ (49) సహా 16 మంది మరణించిన విషయం తెలిసిందే. మరోవైపు మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపిన దుబాయ్లోని భారత కాన్సులేట్.. మృతదేహాలను స్వదేశానికి తరలించింది. ఇదే దుర్ఘటనలో మరో ఇద్దరు భారతీయులు చనిపోయారు. దుబాయ్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసే కేరళలోని మలప్పురానికి చెందిన జేషి కందమంగళత్, ఆమె భర్త రిజేష్ కలంగదన్లు కూడా ఇదే ప్రమాదంలో మరణించారు. ఇప్పటికే వీరి మృతదేహాలను కేరళకు తరలించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









