అబుధాబి పోలీసుల నుండి ఈ మెసేజ్ అందుకున్నారా?
- April 18, 2023
యూఏఈ: అబుధాబి పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ కు అనుగుణంగా జరిమానాలు కాకుండా..ఎమిరేట్లోని వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి హెచ్చరించే మెసేజ్ లను అందుకున్నట్లు తెలిపారు. అబుధాబిలోని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ రోడ్లో కనిష్ట వేగం 120కిమీ కంటే తక్కువ వేగంతో నడిపినందుకు ఇటీవల 400 దిర్హామ్ల జరిమానా విధించారు. ఎడమ నుండి మొదటి రెండవ లేన్లకు పరిమితి వర్తిస్తుంది. కానీ భారీ వాహనాలకు వర్తించదని పోలీసులు స్పష్టం చేశారు. నెమ్మదిగా వెళ్లే వాహనాలు అవసరమైతే మూడవ లేన్ను ఉపయోగించవచ్చని, ఇక్కడ కనీస వేగ పరిమితి వర్తించదని తెలిపారు. ఏప్రిల్లో నిర్దేశిత మార్గాల్లో కనీస వేగ పరిమితిని ఉల్లంఘించిన వారికి హెచ్చరిక నోటీసులు జారీ చేయనున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఆ తర్వాత మే 1 నుంచి జరిమానా వర్తిస్తుందని వారు తెలిపారు. ఇప్పుడు, ఈ రహదారిపై కనీస వేగ పరిమితిని ఉల్లంఘించిన వారికి హెచ్చరిక మేసెజ్ లు అందడంతో ఈ నియమం అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







