అబుధాబి పోలీసుల నుండి ఈ మెసేజ్ అందుకున్నారా?
- April 18, 2023
యూఏఈ: అబుధాబి పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ కు అనుగుణంగా జరిమానాలు కాకుండా..ఎమిరేట్లోని వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి హెచ్చరించే మెసేజ్ లను అందుకున్నట్లు తెలిపారు. అబుధాబిలోని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ రోడ్లో కనిష్ట వేగం 120కిమీ కంటే తక్కువ వేగంతో నడిపినందుకు ఇటీవల 400 దిర్హామ్ల జరిమానా విధించారు. ఎడమ నుండి మొదటి రెండవ లేన్లకు పరిమితి వర్తిస్తుంది. కానీ భారీ వాహనాలకు వర్తించదని పోలీసులు స్పష్టం చేశారు. నెమ్మదిగా వెళ్లే వాహనాలు అవసరమైతే మూడవ లేన్ను ఉపయోగించవచ్చని, ఇక్కడ కనీస వేగ పరిమితి వర్తించదని తెలిపారు. ఏప్రిల్లో నిర్దేశిత మార్గాల్లో కనీస వేగ పరిమితిని ఉల్లంఘించిన వారికి హెచ్చరిక నోటీసులు జారీ చేయనున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఆ తర్వాత మే 1 నుంచి జరిమానా వర్తిస్తుందని వారు తెలిపారు. ఇప్పుడు, ఈ రహదారిపై కనీస వేగ పరిమితిని ఉల్లంఘించిన వారికి హెచ్చరిక మేసెజ్ లు అందడంతో ఈ నియమం అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







