అబుధాబి పోలీసుల నుండి ఈ మెసేజ్ అందుకున్నారా?
- April 18, 2023
యూఏఈ: అబుధాబి పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ కు అనుగుణంగా జరిమానాలు కాకుండా..ఎమిరేట్లోని వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి హెచ్చరించే మెసేజ్ లను అందుకున్నట్లు తెలిపారు. అబుధాబిలోని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ రోడ్లో కనిష్ట వేగం 120కిమీ కంటే తక్కువ వేగంతో నడిపినందుకు ఇటీవల 400 దిర్హామ్ల జరిమానా విధించారు. ఎడమ నుండి మొదటి రెండవ లేన్లకు పరిమితి వర్తిస్తుంది. కానీ భారీ వాహనాలకు వర్తించదని పోలీసులు స్పష్టం చేశారు. నెమ్మదిగా వెళ్లే వాహనాలు అవసరమైతే మూడవ లేన్ను ఉపయోగించవచ్చని, ఇక్కడ కనీస వేగ పరిమితి వర్తించదని తెలిపారు. ఏప్రిల్లో నిర్దేశిత మార్గాల్లో కనీస వేగ పరిమితిని ఉల్లంఘించిన వారికి హెచ్చరిక నోటీసులు జారీ చేయనున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఆ తర్వాత మే 1 నుంచి జరిమానా వర్తిస్తుందని వారు తెలిపారు. ఇప్పుడు, ఈ రహదారిపై కనీస వేగ పరిమితిని ఉల్లంఘించిన వారికి హెచ్చరిక మేసెజ్ లు అందడంతో ఈ నియమం అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









