ఆరోగ్య మంత్రి తో భారత రాయబారి భేటీ
- April 18, 2023
మనామా: బహ్రెయిన్ ఆరోగ్య మంత్రి డాక్టర్ జలీలా బింట్ అల్ సయ్యద్ జవాద్ హసన్.. భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవను కలుసుకుని ఇరు దేశాల మధ్య ఉమ్మడి సహకారం పై చర్చించారు.ఈ సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ లుల్వా రషీద్ షోయిటార్ కూడా పాల్గొన్నారు.బహ్రెయిన్ రాజ్యం, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు.. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో క్రమంగా పెరుగుతున్న సహకారాన్ని మంత్రి జవాద్ హసన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇరుపక్షాలు ఉమ్మడి సహకారంతో పాటు నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి, శిక్షణను ప్రోత్సహించడానికి సమన్వయం గురించి చర్చించారు. ఆరోగ్య అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు. ఆరోగ్యం, వైద్య విజ్ఞాన రంగాలలో మరింత సహకారానికి ఉమ్మడి ప్రయత్నాలను పేర్కొంటూ, రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని భారత రాయబారి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!
- ఒమన్ పై ద్రోణి ఎఫెక్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- రీఫండ్, తేదీ మార్పులకు ఖతార్ ఎయిర్వేస్ అవకాశం..!!









