ఆరోగ్య మంత్రి తో భారత రాయబారి భేటీ
- April 18, 2023
మనామా: బహ్రెయిన్ ఆరోగ్య మంత్రి డాక్టర్ జలీలా బింట్ అల్ సయ్యద్ జవాద్ హసన్.. భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవను కలుసుకుని ఇరు దేశాల మధ్య ఉమ్మడి సహకారం పై చర్చించారు.ఈ సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ లుల్వా రషీద్ షోయిటార్ కూడా పాల్గొన్నారు.బహ్రెయిన్ రాజ్యం, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు.. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో క్రమంగా పెరుగుతున్న సహకారాన్ని మంత్రి జవాద్ హసన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇరుపక్షాలు ఉమ్మడి సహకారంతో పాటు నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి, శిక్షణను ప్రోత్సహించడానికి సమన్వయం గురించి చర్చించారు. ఆరోగ్య అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు. ఆరోగ్యం, వైద్య విజ్ఞాన రంగాలలో మరింత సహకారానికి ఉమ్మడి ప్రయత్నాలను పేర్కొంటూ, రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని భారత రాయబారి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







