హయా పోర్టల్ అప్డేట్.. ఐదుగురు అతిథులకు ఆతిథ్యం
- April 19, 2023
దోహా: విహారయాత్ర లేదా వ్యాపారం కోసం ఖతార్ను సందర్శించడం ఇకపై సులువైన ప్రక్రియగా మారింది. ఈ మేరకు హయ్యా పోర్టల్ కొన్ని నిబంధనలను అప్డేట్ చేసింది. పోర్టల్లో హోస్ట్గా సైన్ అప్ చేయడానికి, ఆస్తి వివరాలను యాడ్ చేసేందుకు కుటుంబ సభ్యులను ఆహ్వానించాలనుకునే ప్రక్రియను హయ్యా పోర్టల్ వివరించింది. మెత్రాష్2 యాప్లో నమోదైన చెల్లుబాటు అయ్యే QID, చిరునామా రుజువు ఉన్న ఖతార్ నివాసితులు ఎవరైనా హయ్యాలో హోస్ట్గా సైన్ అప్ చేయవచ్చని పేర్కొంది. గరిష్ఠంగా ఒక ఆస్తిపై అయిదుగురు అతిథులను ఆహ్వానించవచ్చని వివరించింది. నివాసితులు అతిథుల గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం తప్పనిసరి అని హయ్యా పోర్టల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







