బోగస్ జాబ్ రిక్రూట్మెంట్పై వార్నింగ్ అలెర్ట్
- April 19, 2023
బహ్రెయిన్: ఆన్లైన్ రిక్రూట్మెంట్ స్కామ్ల పెరుగుదల నేపథ్యంలో బహ్రెయిన్ వార్నింగ్ అలెర్ట్ జారీ చేసింది. బోగస్ జాబ్ రిక్రూట్మెంట్పై జాగ్రత్తగా ఉండాలని, జెన్యూన్ జాబ్ పోర్టల్లను పరిశీలించి.. సంబంధిత అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలని ఉద్యోగార్థులను అధికారులను కోరారు. ఉద్యోగార్థులను సంప్రదించడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్లైన్ ప్రకటనలను మోసగాళ్లు ఇస్తారని గుర్తుచేశారు. అనేక సందర్భాల్లో, రాజ్యంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చే ఏజెంట్లు "ప్రాసెసింగ్ ఫీ" పేరిట అభ్యర్థుల నుంచి దండుకొని మోసం చేస్తారని తెలిపారు. అలాగే వివిధ లింకులతో సోషల్ మీడియాలో ఉద్యోగార్ధులను ఆకర్షిస్తూ.. డబ్బు మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల కొన్ని సంస్థలు ఉద్యోగుల నియామకానికి సంబంధించి ప్రముఖ సోషల్ మీడియా సైట్స్ తో సహా అనేక జాబ్ పోర్టల్లలో నకిలీ ప్రకటనలు ఇచ్చిన నేపథ్యంలో ఈ వార్నింగ్ అలెర్ట్ ను అధికారులు జారీ చేశారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







