యుక్రెయిన్ ప్రజలను వణికించిన ప్లాష్ లైట్..
- April 20, 2023
యుక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏడాదికాలంకుపైగా రష్యా సైన్యం దాడులతో యుక్రెయిన్ ప్రజలు భయంతో వణికిపోతూనే ఉన్నారు. ఎప్పుడు ఏ ప్రాంతంలో రష్యా క్షిపణులు పడుతాయో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని యుక్రెన్ ప్రజలు జీవనం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో యుక్రెయిన్ రాజధాని కీవ్ గగనతలంలో ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. వేగంగా అది భూమిపైకి వస్తున్నట్లు ఉండటంతో రష్యా వైమానిక దాడి అయి ఉండొచ్చని స్థానిక ప్రజలు భయంతో వణికిపోయారు.
కీవ్ గగనతలంపై బుధవారం రాత్రి 10గంటల సమయంలో ఈ ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. ఈ వెలుగుతో అప్రమత్తమైన అధికారులు వైమానిక దాడులు జరుగుతోందేమోనని హెచ్చరికలు జారీ చేశారు. అయితే, కొద్దిసేపటి తరువాత అది వైమానిక దాడివల్ల వచ్చిన వెలుగు కాదని, నాసా ఉపగ్రహం వల్ల వచ్చిన వెలుగు అని తేలింది. నాసా వారం రోజుల క్రితం ఈ విషయాన్ని చెప్పింది. ఓ ఉపగ్రహం బుధవారం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని, ఇది వాతావరణంలోకి ప్రవేశించగానే కాలిపోతుందని పేర్కొంది. ఆ సమయంలో వెలుగు వస్తుందని, కానీ భూమిపై ఎవరికి ప్రమాదం ఉండదని తెలిపింది.
కీవ్ గగనతలంపై ప్రకాశవంతమైన వెలుగును కొందరు వీడియోల్లో బంధించారు. స్థానిక ప్రసార మాద్యమాల్లో ఆ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ కావడంతో మీమ్స్ హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎయిర్ ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసింది. మీమ్స్ లో మైమానిక దళం గుర్తులను వినియోగించకూడదని హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









