ఖతార్ సరిహద్దులో నమోదిత వాహనాల కోసం ప్రత్యేక లేన్
- April 20, 2023
దోహా: ఈద్ అల్ ఫితర్ వేడుకలకు రెండ్రోజుల ముందు అబూ సమ్రా సరిహద్దును దాటే ప్రీ-రిజిస్టర్డ్ వాహనాలకు ఒక లేన్ను కేటాయించనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) వెల్లడించింది. దేశంలోకి వీసా సేవల కోసం హయ్యా ప్లాట్ఫారమ్ను విస్తరించనున్నట్లు పేర్కొంది. Metrash2 ద్వారా పౌరులు, నివాసితులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ముందస్తు నమోదు ద్వారా సమయం ఆదా అవ్వడంతోపాటు క్యూలను నిరోధిస్తుందని మంత్రిత్వ శాఖ తన ట్వీట్ లో తెలిపింది. మరోవైపు ఖతార్ టూరిజం హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అబూ సమ్రా సరిహద్దుకు వచ్చే సందర్శకులు ఈద్ అల్-ఫితర్ 2023 సందర్భంగా ప్రత్యేక ‘ఈద్య’ బహుమతి ప్యాకేజీని అందుకోనున్నట్లు ప్రకటించింది. సందర్శకులకు పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడం, ప్రయాణికులకు స్వాగతించే గమ్యస్థానంగా ఖతార్ను ప్రోత్సహించడం ఈ చొరవ లక్ష్యమని పేర్కొంది. గత సంవత్సరం, జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ (GAC) ఈద్ అల్ ఫితర్ వేడుకల సందర్భంగా అబూ సమ్రా ద్వారా ఖతార్లోకి ప్రవేశించే/నిష్క్రమించే 62,628 వాహనాలకు సేవలు అందించినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్







