ఖతార్ సరిహద్దులో నమోదిత వాహనాల కోసం ప్రత్యేక లేన్
- April 20, 2023
దోహా: ఈద్ అల్ ఫితర్ వేడుకలకు రెండ్రోజుల ముందు అబూ సమ్రా సరిహద్దును దాటే ప్రీ-రిజిస్టర్డ్ వాహనాలకు ఒక లేన్ను కేటాయించనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) వెల్లడించింది. దేశంలోకి వీసా సేవల కోసం హయ్యా ప్లాట్ఫారమ్ను విస్తరించనున్నట్లు పేర్కొంది. Metrash2 ద్వారా పౌరులు, నివాసితులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ముందస్తు నమోదు ద్వారా సమయం ఆదా అవ్వడంతోపాటు క్యూలను నిరోధిస్తుందని మంత్రిత్వ శాఖ తన ట్వీట్ లో తెలిపింది. మరోవైపు ఖతార్ టూరిజం హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అబూ సమ్రా సరిహద్దుకు వచ్చే సందర్శకులు ఈద్ అల్-ఫితర్ 2023 సందర్భంగా ప్రత్యేక ‘ఈద్య’ బహుమతి ప్యాకేజీని అందుకోనున్నట్లు ప్రకటించింది. సందర్శకులకు పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడం, ప్రయాణికులకు స్వాగతించే గమ్యస్థానంగా ఖతార్ను ప్రోత్సహించడం ఈ చొరవ లక్ష్యమని పేర్కొంది. గత సంవత్సరం, జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ (GAC) ఈద్ అల్ ఫితర్ వేడుకల సందర్భంగా అబూ సమ్రా ద్వారా ఖతార్లోకి ప్రవేశించే/నిష్క్రమించే 62,628 వాహనాలకు సేవలు అందించినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









