జమ్ముకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం..నలుగురు సైనికులు సజీవదహనం

- April 20, 2023 , by Maagulf
జమ్ముకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం..నలుగురు సైనికులు సజీవదహనం

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లోని ఫూంచ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం ఫూంచ్‌ - జమ్మూ హైవేపై వెళ్తున్న ఆర్మీ ట్రక్కులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలధాటికి ట్రక్కు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  ఈ ఘటనపై విచారణకు  ఆదేశించినట్లు  ఉన్నతాధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com