కువైట్ అమీర్‌కు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

- April 21, 2023 , by Maagulf
కువైట్ అమీర్‌కు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

కువైట్ సిటీ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా హెచ్.ఇ. కువైట్ అమీర్ హిస్ హైనెస్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్, కువైట్ రాష్ట్ర ప్రజలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజులుగా భారతదేశంలో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు పవిత్ర రమదాన్ మాసాన్ని పాటిస్తున్నారని నరేంద్ర మోడీ అమీర్‌కు పంపిన వ్యక్తిగత లేఖలో పేర్కొన్నారు. సాంప్రదాయ ఉత్సాహంతో ఈద్ అల్ ఫితర్ సందర్భంగా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల మధ్య సోదరభావం, ఐక్యత విలువలు పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఈద్ అల్ ఫిత్ర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ శాంతి, సామరస్యం, మంచి ఆరోగ్యం, ఆనందం అందాలని ప్రధాని మోదీ ప్రార్థించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com