'ఈద్ జాయ్' కార్యక్రమంలో 5,000 బహుమతుల పంపిణీ
- April 22, 2023
దోహా: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా పిల్లలకు అవ్కాఫ్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎండోమెంట్స్ "ఈద్ జాయ్" కార్యక్రమంలో భాగంగా 5,000 బహుమతులను పంపిణీ చేసింది. ఎండోమెంట్ బ్యాంక్ మద్దతుతో ఖతార్ అంతటా మస్జీదులలో బహుమతులు పంపిణీ చేశారు. "ఎండోమెంట్ ఈజ్ ఎ కమ్యూనిటీ పార్టనర్షిప్" అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఖతార్లో కమ్యూనిటీ డెవలప్మెంట్, మానవ సంరక్షణను సాధించడంలో ప్రభావవంతంగా దోహదపడేందుకు, ప్రభుత్వ- ప్రైవేట్ సంస్థల సహకారం ద్వారా సమాజంలోని అనేక రంగాలకు.. దాని వివిధ విభాగాలకు సేవ చేయడం కోసం పాటుపడుతున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎండోమెంట్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎండోమెంట్స్ ఎండోమెంట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎండోమెంట్ బ్యాంక్లలో బదిలీ చేయాలనుకునే వారు ఆమోదించబడిన పద్ధతుల ద్వారా ఎండోమెంట్ను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!







