'ఈద్ జాయ్' కార్యక్రమంలో 5,000 బహుమతుల పంపిణీ
- April 22, 2023
దోహా: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా పిల్లలకు అవ్కాఫ్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎండోమెంట్స్ "ఈద్ జాయ్" కార్యక్రమంలో భాగంగా 5,000 బహుమతులను పంపిణీ చేసింది. ఎండోమెంట్ బ్యాంక్ మద్దతుతో ఖతార్ అంతటా మస్జీదులలో బహుమతులు పంపిణీ చేశారు. "ఎండోమెంట్ ఈజ్ ఎ కమ్యూనిటీ పార్టనర్షిప్" అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఖతార్లో కమ్యూనిటీ డెవలప్మెంట్, మానవ సంరక్షణను సాధించడంలో ప్రభావవంతంగా దోహదపడేందుకు, ప్రభుత్వ- ప్రైవేట్ సంస్థల సహకారం ద్వారా సమాజంలోని అనేక రంగాలకు.. దాని వివిధ విభాగాలకు సేవ చేయడం కోసం పాటుపడుతున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎండోమెంట్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎండోమెంట్స్ ఎండోమెంట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎండోమెంట్ బ్యాంక్లలో బదిలీ చేయాలనుకునే వారు ఆమోదించబడిన పద్ధతుల ద్వారా ఎండోమెంట్ను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







