పాలస్తీనాలో భారత మొదటి మహిళా ప్రతినిధిగా రేణు యాదవ్
- April 24, 2023
బహ్రెయిన్: గతంలో బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయంలో సెకండ్ సెక్రటరీగా పనిచేసిన రేణు యాదవ్ పాలస్తీనా రాష్ట్రానికి కొత్త ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన మొదటి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. నిన్న జరిగిన సమావేశంలో పాలస్తీనా విదేశాంగ మంత్రి డాక్టర్ రియాద్ అల్-మల్కీకి రేణుయాదవ్ భారతదేశ ప్రతినిధిగా (డిసిగ్నేట్) తన ఆధారాలను సమర్పించారు. 2013లో ఇండియన్ ఫారిన్ సర్వీస్లో రేణు యాదవ్ చేరారు. కైరోలోని భారత రాయబార కార్యాలయంలో రేణుయాదవ్ తొలి నియామకాన్ని పొందారు. రాయబార కార్యాలయంలో విధులతో పాటు ఆమె అమెరికన్ యూనివర్సిటీ, కైరో నుండి అరబిక్ భాషలో అడ్వాన్స్డ్ డిప్లొమా చేశారు. ఆ తర్వాత బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయంలో సెకండ్ సెక్రటరీ/ఫస్ట్ సెక్రటరీగా, పరిపాలన, మీడియా, విద్య మరియు రాజకీయ కార్యకలాపాలను నిర్వహించింది. రేణుయాదవ్ భారతదేశంలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు. మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, జిబౌటీలకు సంబంధించిన వ్యవహారాలను నిర్వహించారు. ఆమె నియామకం భారతదేశం - పాలస్తీనా మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







