పద్మ పురస్కారాల ప్రక్రియ ప్రారంభం
- May 09, 2016
పద్మ పురస్కారాల ప్రక్రియ ప్రారంభమైంది. 2017 ఏడాదికి గాను వివిధ రంగాల్లో అత్యుతన్న సేవలందించిన వారికి పద్మ పురస్కారాలతో గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. నామినేషన్లు పంపేందుకు 15 సెప్టెంబర్, 2016 చివరి తేదీ అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. www.padmaawards.gov.in వెబ్సైట్ ద్వారా పంపిన ప్రతిపాదనలు మాత్రమే ఆమోదిస్తారని పేర్కొంది. ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో పొందుపర్చినట్లు వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, భారతరత్న, పద్మ విభూషణ్ పురస్కారాలు పొందిన వారు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఎంపీలు అవార్డులకు సిఫార్సు చేయవచ్చు. ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన పద్మ అవార్డుల కమిటీ నామినేషన్లు పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. 2017కు గాను వచ్చే ఏడాది జనవరి 25న పద్మ పురస్కార గ్రహీతల పేర్లు వెల్లడిస్తారు.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు







