పద్మ పురస్కారాల ప్రక్రియ ప్రారంభం
- May 09, 2016
పద్మ పురస్కారాల ప్రక్రియ ప్రారంభమైంది. 2017 ఏడాదికి గాను వివిధ రంగాల్లో అత్యుతన్న సేవలందించిన వారికి పద్మ పురస్కారాలతో గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. నామినేషన్లు పంపేందుకు 15 సెప్టెంబర్, 2016 చివరి తేదీ అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. www.padmaawards.gov.in వెబ్సైట్ ద్వారా పంపిన ప్రతిపాదనలు మాత్రమే ఆమోదిస్తారని పేర్కొంది. ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో పొందుపర్చినట్లు వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, భారతరత్న, పద్మ విభూషణ్ పురస్కారాలు పొందిన వారు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఎంపీలు అవార్డులకు సిఫార్సు చేయవచ్చు. ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన పద్మ అవార్డుల కమిటీ నామినేషన్లు పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. 2017కు గాను వచ్చే ఏడాది జనవరి 25న పద్మ పురస్కార గ్రహీతల పేర్లు వెల్లడిస్తారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







