టీజీఎస్ ప్రీమియర్ లీగ్ క్రికెట్: విజేతగా నిలిచిన ‘వీర తెలంగాణ జట్టు’

- April 25, 2023 , by Maagulf
టీజీఎస్ ప్రీమియర్ లీగ్ క్రికెట్: విజేతగా నిలిచిన ‘వీర తెలంగాణ జట్టు’

దోహా: ఏపీఎల్  మైదానంలో జరిగిన తెలంగాణ గల్ఫ్ సమితి(TGS) ప్రీమియర్ లీగ్ సీజన్ - 08 క్రికెట్ టోర్నమెంట్ గ్రాండ్ ఫినాలేలో క్యూఎన్‌టీఓపై వీర తెలంగాణ జట్టు విజయం సాధించి టైటిల్‌ను గెలుచుకుంది. అల్ తుమ్మా గ్రౌండ్‌లో నిర్వహించిన బహుమతుల పంపిణీ కార్యక్రమంలో టీజీఎస్ ప్రధాన కార్యదర్శి సాయిగిరి వంశీ పాల్గొని మాట్లాడారు. టోర్నమెంట్ విజయవంతానికి కృషి చేసిన ఏపీఎల్, TGS స్పోర్ట్ ఇన్‌చార్జి మహేందర్,  TGS PRO సంజు థామస్, TGS MC టీమ్ సభ్యులు, స్పాన్సర్‌లు, వాలంటీర్‌లు, కమ్యూనిటీ నాయకులకు.. ఇతర మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపారు.

టీజీఎస్ అనేది ఇండియన్ ఎంబసీ ఖతార్ ఆధ్వర్యంలో అపెక్స్ బాడీ ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ అనుబంధ సంస్థ అని, ఇది ప్రధానంగా బ్లూ కాలర్ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రీమియర్ లీగ్ ను బ్లూ కాలర్ వర్కర్లు పనిఒత్తిడి నుంచి దూరంగా రిఫ్రెష్ కావడానికి కొంత సమయాన్ని అందించే నిర్దిష్ట లక్ష్యంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అవార్డు ప్రదానోత్సవం వేడుకలో సీనియర్ సంఘం నాయకుడు కేఎస్  ప్రసాద్, ICBF  షానవాస్ బావా జీ, ICBF వైస్ ప్రెసిడెంట్ దీపక్ శెట్టి జీ, ISC కమిటీ సభ్యుడు సి.దీపక్, తెలుగు కళా సమితి అధ్యక్షుడిగా ఎన్నికైన డి. హరీష్ రెడ్డి, ICBF కమిటీ మెంబర్ శంకర్ గౌడ్, తెలుగు స్పోర్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ రఫిక్ జీ తదితరులు పాల్గొన్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com