మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- March 23, 2026
హైదరాబాద్: హైదరాబాద్ నగర జనాభా మరియు వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనమండలిలో ప్రకటించారు. ఇందులో భాగంగా నగరాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నట్లు వెల్లడించారు.
ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు భారీ ఎలివేటెడ్ కారిడార్లు, అండర్పాస్లు, సర్ఫేస్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మెట్రో రైలు విస్తరణలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ అండ్ టీ సంస్థ ముందుకు రాకపోవడంతో, కేంద్ర నిబంధనల ప్రకారం రూ. 15 వేల కోట్లతో మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. త్వరలోనే మరో 76 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లను విస్తరించబోతున్నట్లు సీఎం భరోసా ఇచ్చారు.
ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు భారీ ఎలివేటెడ్ కారిడార్లు, అండర్పాస్లు, సర్ఫేస్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మెట్రో రైలు విస్తరణలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ అండ్ టీ సంస్థ ముందుకు రాకపోవడంతో, కేంద్ర నిబంధనల ప్రకారం రూ. 15 వేల కోట్లతో మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. త్వరలోనే మరో 76 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లను విస్తరించబోతున్నట్లు సీఎం భరోసా ఇచ్చారు.
నగర సుందరీకరణలో భాగంగా మూసీ నది పునరుజ్జీవనంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మూసీని గత వైభవానికి తీసుకువస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. దీనితో పాటు, దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ‘ఫ్యూచర్ సిటీ’ ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని, గతంలో గుజరాత్ అభివృద్ధి కోసం అన్ని పార్టీలు ఎలాగైతే కలిశాయో, హైదరాబాద్ అభివృద్ధి కోసం కూడా ప్రతిపక్షాలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
- దుబాయ్ ఇ-స్కూటర్ రూల్స్: జోన్లు, జరిమానాల పై ఆర్టీఏ క్లారిటీ..!!
- అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో మెరిసిన ఒమన్..!!
- హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం..ప్రపంచ వాణిజ్యానికి ముప్పు..!!
- కువైట్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకీకరణ..!!
- మక్కా, మదీనాలో 23వేలకు పైగా తనిఖీలు..!!
- చూపు లేకుండా శిశువు జననం..తల్లికి రూ.కోటి పరిహారం









