‘PS 2’.! మణిరత్నం డ్రీమ్ ఈ సారైనా నెరవేరుతుందా.?
- April 25, 2023సీనియర్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్గా రూపొందింది ‘పొన్నియన్ సెల్వన్’. ఓ పాపులర్ నవల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాని రెండు భాగాలుగా మణిరత్నం రిలీజ్ చేస్తున్నారు.
ఆల్రెడీ మొదటి భాగం సో సోగా పేరు తెచ్చుకుంది. ఇక, రెండో భాగం రిలీజ్కి సర్వం సిద్ధమైంది. ఈ శుక్రవారం అనగా ఏప్రిల్ 28న ‘పొన్నియన్ సెల్వన్ 2’ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భారీ మల్టీ స్టారర్గా రూపొందిన ఈ చిత్రం రెండో పార్ట్ ఊహించని విధంగా విజువల్ ఇంపాక్ట్ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు.
విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్యా రాయ్, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రెండో భాగం అంచనాలకు తగ్గట్లుగా పెద్దగా బజ్ అయితే క్రియేట్ చేయడం లేదు. కానీ, రిలీజ్ తర్వాత ఓ మోస్తరు పాజిటివ్ టాక్ వచ్చినా మణిరత్నం డ్రీమ్ నెరవేరినట్లే.
చూడాలి మరి. ఈ భారీ మల్టీ స్టారర్ ‘పొన్నియన్ సెల్వన్ 2’ ఎలా వుండబోతోందో.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు