కేరళలో తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
- April 25, 2023
తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీ కేరళలో తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. రైలులోని ఓ కోచ్ లో పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోడీ సంభాషించారు. ఈ వందే భారత్ రైలు తిరువనంతపురం నుంచి కాసరగోడ్ వరకు ప్రయాణించనుంది. ఈ రైలు కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, పతనంతిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్ 11 జిల్లాలను కవర్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో కేరళ సీఎం పినరయ్ విజయన్, రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ పాల్గొన్నారు. అంతకుముందు రోడ్ షో నిర్వహించిన ప్రధాని మోడీ . కేరళ అభివృద్ధి చెందితే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది దేశీయంగా తయారు చేయబడిన సెమీ-హై-స్పీడ్ రైలు. ఈ రైలు అత్యాధునికమైన ప్రయాణీకుల సౌకర్యాలను అందిస్తోంది. ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. మోడీ కేరళ పర్యటనలో అసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోడీపై ఎప్పుడూ విమర్శలు చేసే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. మోడీ కూడా ఆయన్ను ఆప్యాయంగా పలకరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి









