తండ్రి, కుమార్తెలకు షాకిచ్చిన కోర్టు.. BD15,000 రీఫండ్ చేయాలని ఆదేశం
- April 26, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ టీచర్స్ కాలేజీలో చదివి, అనంతరం ఒప్పందాన్ని ఉల్లంఘించిన బహ్రెయిన్ వ్యక్తి, అతని కుమార్తెలకు హై సివిల్ కోర్టులో చుక్కెదురైంది. విద్యా మంత్రిత్వ శాఖకు BD15,000 రీఫండ్ చేయాలని హై సివిల్ కోర్ట్ వారిని ఆదేశించింది. కేసు రికార్డుల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసినందుకు ప్రతిఫలంగా బహ్రెయిన్ టీచర్స్ కాలేజీలో తన చదువును పూర్తి చేసేందుకు మంత్రిత్వ శాఖ తన కుమార్తెకు స్పాన్సర్షిప్ ఇచ్చింది. అయితే, ఆమె తన చదువు తర్వాత దేశం విడిచి వెళ్లింది. ఆమె విద్య కోసం ఆమె అందుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాలని మంత్రిత్వ శాఖ ఆమెపై ఫిర్యాదు చేసింది. "ఆమె ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆమె తన తండ్రితో కలిసి దేశం విడిచి వెళ్లింది. దేశంలో ఆమె పని చేయలేనని పేర్కొంది." అని మంత్రిత్వ శాఖ న్యాయవాది చెప్పారు. సివిల్ కోర్ట్ మంత్రిత్వ శాఖకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఒప్పందం షరతులను పాటించడంలో సదరు స్టూడెంట్ విఫలమైందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆమోదయోగ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ప్రతివాదులు విద్యా మంత్రిత్వ శాఖకు BD15,000 చెల్లించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
తాజా వార్తలు
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి
- ఏపీ విద్యార్థులకు తీపికబురు.. జేఈఈ, నీట్ ఉచిత కోచింగ్..
- ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కుదరని స్పష్టత..
- గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం
- కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు డ్రోన్లు, క్షిపణి దాడులను తిప్పికొట్టాయి
- IRGC-అనుబంధ నెట్వర్క్ బస్ట్.. 41 మంది అరెస్ట్..!!
- కువైట్ లో 90 నిమిషాల ముందే చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత..!!









