తండ్రి, కుమార్తెలకు షాకిచ్చిన కోర్టు.. BD15,000 రీఫండ్ చేయాలని ఆదేశం
- April 26, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ టీచర్స్ కాలేజీలో చదివి, అనంతరం ఒప్పందాన్ని ఉల్లంఘించిన బహ్రెయిన్ వ్యక్తి, అతని కుమార్తెలకు హై సివిల్ కోర్టులో చుక్కెదురైంది. విద్యా మంత్రిత్వ శాఖకు BD15,000 రీఫండ్ చేయాలని హై సివిల్ కోర్ట్ వారిని ఆదేశించింది. కేసు రికార్డుల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసినందుకు ప్రతిఫలంగా బహ్రెయిన్ టీచర్స్ కాలేజీలో తన చదువును పూర్తి చేసేందుకు మంత్రిత్వ శాఖ తన కుమార్తెకు స్పాన్సర్షిప్ ఇచ్చింది. అయితే, ఆమె తన చదువు తర్వాత దేశం విడిచి వెళ్లింది. ఆమె విద్య కోసం ఆమె అందుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాలని మంత్రిత్వ శాఖ ఆమెపై ఫిర్యాదు చేసింది. "ఆమె ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆమె తన తండ్రితో కలిసి దేశం విడిచి వెళ్లింది. దేశంలో ఆమె పని చేయలేనని పేర్కొంది." అని మంత్రిత్వ శాఖ న్యాయవాది చెప్పారు. సివిల్ కోర్ట్ మంత్రిత్వ శాఖకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఒప్పందం షరతులను పాటించడంలో సదరు స్టూడెంట్ విఫలమైందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆమోదయోగ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ప్రతివాదులు విద్యా మంత్రిత్వ శాఖకు BD15,000 చెల్లించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







