తగ్గేదేలే.. త్వరలో రషీద్ రోవర్-2 ప్రయోగం: షేక్ మొహమ్మద్
- April 27, 2023
యూఏఈ: యూఏఈ నిర్మించిన రషీద్ రోవర్ ప్రయోగం విఫలం కావడంతో.. త్వరలోనే రోవర్ రషీద్ 2 ప్రయోగం చేపట్టనున్నట్లు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. రషీద్ రోవర్ను తీసుకెళ్లిన హకుటో-ఆర్ మిషన్ 1 అంతరిక్ష నౌక చంద్రుని ఉపరితలంపై కూలిపోయిన విషయం తెలిసిందే. బుధవారం దుబాయ్ పాలకుడు మహ్మద్ బిన్ రషీద్ అంతరిక్ష కేంద్రాన్ని (MBRSC) సందర్శించారు. చంద్రునిపై రోవర్ను ల్యాండ్ చేసే కొత్త రషీద్ 2 ప్రాజెక్ట్ పనులను ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. రషీద్ 1 చంద్రుని ఉపరితలంపై "ఎమిరేట్స్ జెండాను మోస్తున్నట్లు" షేక్ మహమ్మద్ చెప్పారు. రెండు రోవర్లకు ఆధునిక దుబాయ్ని నిర్మించిన దివంగత షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ పేరు పెట్టారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









