పాప్యులారిటీ కోసం పిచ్చి పనులు చేస్తే బాగుండదు: సజ్జనార్ హెచ్చరిక
- May 03, 2023
హైదరాబాద్: స్కూటర్ పై వెళ్తూ హైదరాబాద్ సిటీ బస్సును వెనక నుంచి కాలితో నెడుతున్నట్టుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మిథానీ డిపోకు చెందిన బస్సు 104-రూట్లో ప్రయాణిస్తుండగా స్కూటర్ పై వెళ్తున్న ఓ యువకుడు బస్సును కాలితో ముందుకు నెడుతున్నట్టుగా పోజిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
దీనికి స్పందించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో పాప్యులారిటీ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దన్నారు. నడిరోడ్డు పై ఇలాంటి ఫీట్లు చేసి ప్రమాదాలపాలై తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని సూచించారు. ఇలాంటి వారిపై చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









