చిరంజీవి చెప్పిన డైలాగ్‌ను రాంచరణ్‌ పలికాడు

- May 10, 2016 , by Maagulf
చిరంజీవి చెప్పిన డైలాగ్‌ను రాంచరణ్‌ పలికాడు

 'చిరుత'నయుడిగా తెరంగ్రేటం చేసిన రాంచరణ్‌ తనదైన శైలిలో చిత్రాలను చేస్తూ.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తమిళ రీమేక్‌ 'తనీ ఒరువన్‌'లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి 'ధ్రువ' అనే పేరు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విషయమేమిటంటే.. చిరంజీవి నటించిన 'గ్యాంగ్‌లీడర్‌' విడుదలై మే 9వ తేదీకి పాతికేళ్లు పూర్తి చేసుకుంది. మాస్‌ హీరోగా చిరంజీవిని ఓ మెట్టు ఎక్కించిన ఈ చిత్రంలో ఆయన చెప్పిన డైలాగ్‌ను రాంచరణ్‌ డబ్‌ స్మాష్‌చేశాడు. 'చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో.. రఫ్ఫాడించేస్తా' అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్‌ను రాంచరణ్‌ పలికాడు. ఈ వీడియోను చెర్రీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పటికే చిరు పాటలను తన చిత్రాల్లో రీమిక్స్‌ చేస్తున్న చెర్రీ భవిష్యత్తులో 'గ్యాంగ్‌లీడర్‌' లాంటి మాస్‌ మసాలా కథతో వస్తాడేమో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com