APSRTC ఎండీతోపాటు మరో నలుగురు అధికారులకు జైలు శిక్ష
- May 04, 2023
అమరావతి: ఆదేశాలను ధిక్కరించిన అధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకుగానూ ఐదుగురు అధికారులకు నెల రోజులు జైలు శిక్ష విధించింది. ఏపీఎస్ఆర్టీసీ ఎండీతోపాటు మరో నలుగురికి నెల రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
ఏపీఎస్ఆర్టీసీ ఫీల్డ్ మెన్లను క్రమబద్ధీకరించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలు పట్టించుకోని అధికారులపై ఫీల్డ్ మెన్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతోపాటు మరో ముగ్గురు అధికారులకు నెల రోజులు జైలు శిక్ష విధించడంతోపాటు రూ.1000 జరిమానా విధించింది. అంతేకాకుండా మే16వ తేదీలోపు రిజిస్ట్రార్ జనరల్ వద్ద లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







