APSRTC ఎండీతోపాటు మరో నలుగురు అధికారులకు జైలు శిక్ష
- May 04, 2023
అమరావతి: ఆదేశాలను ధిక్కరించిన అధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకుగానూ ఐదుగురు అధికారులకు నెల రోజులు జైలు శిక్ష విధించింది. ఏపీఎస్ఆర్టీసీ ఎండీతోపాటు మరో నలుగురికి నెల రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
ఏపీఎస్ఆర్టీసీ ఫీల్డ్ మెన్లను క్రమబద్ధీకరించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలు పట్టించుకోని అధికారులపై ఫీల్డ్ మెన్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతోపాటు మరో ముగ్గురు అధికారులకు నెల రోజులు జైలు శిక్ష విధించడంతోపాటు రూ.1000 జరిమానా విధించింది. అంతేకాకుండా మే16వ తేదీలోపు రిజిస్ట్రార్ జనరల్ వద్ద లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







