APSRTC ఎండీతోపాటు మరో నలుగురు అధికారులకు జైలు శిక్ష

- May 04, 2023 , by Maagulf
APSRTC ఎండీతోపాటు మరో నలుగురు అధికారులకు జైలు శిక్ష

అమరావతి: ఆదేశాలను ధిక్కరించిన అధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకుగానూ ఐదుగురు అధికారులకు నెల రోజులు జైలు శిక్ష విధించింది. ఏపీఎస్ఆర్టీసీ ఎండీతోపాటు మరో నలుగురికి నెల రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

ఏపీఎస్ఆర్టీసీ ఫీల్డ్ మెన్లను క్రమబద్ధీకరించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలు పట్టించుకోని అధికారులపై ఫీల్డ్ మెన్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.

ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతోపాటు మరో ముగ్గురు అధికారులకు నెల రోజులు జైలు శిక్ష విధించడంతోపాటు రూ.1000 జరిమానా విధించింది. అంతేకాకుండా మే16వ తేదీలోపు రిజిస్ట్రార్ జనరల్ వద్ద లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com