ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్
- May 05, 2023
హైదరాబాద్: రాచకొండ పరిధిలో ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ దొంగిలిస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ మీడియాకు వివరాలను వెల్లడించారు. సహదేవ్, అభిమన్యు, నందు లాల్ అనే ముగ్గురిని అరెస్టు చేశామని తెలిపారు. ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ నుంచి జీవనోపాధికి ఇక్కడికి వచ్చి చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు సరిపోక దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
నగర శివారు ప్రాంతాలు వ్యవసాయ బావుల వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్లే టార్గెట్ చేస్తారని వెల్లడించారు. 9 మంది సభ్యుల ముఠాలో ముగ్గురు అరెస్టు కాగా మిగతావారు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరిపై ఇప్పటివరకు 173 కేసులు ఉన్నాయని, అందులో 83 కేసులు ఫస్ట్ టైం డిటెక్ట్ చేశామని చెప్పారు. వీరి వద్ద నుంచి 60 కేజీల కాపర్, లక్ష రూపాయల నగదు, దొంగిలించిన సొమ్ముతో కొన్న ఇండికా కార్, పల్సర్ బైక్ సీజ్ చేశామని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఈ ముఠా సభ్యులు 306 ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేశారని తెలిపారు. ఒక ట్రాన్స్ ఫార్మర్ లోని కాపర్ తీసి లక్ష రూపాయలకు అమ్ముతున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ కి భారీ నష్టం వాటిల్లిందన్నారు. పంట సమయంలో ఈ ముఠా వల్ల రైతులు కూడా చాలా నష్టపోయారని వెల్లడించారు. రాచకొండ, సైబరాబాద్, వికారాబాద్, సిద్దిపేట, నల్గొండ ప్రాంతంలో ఈ ముఠా దొంగతనం చేశారని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









