ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్
- May 05, 2023
హైదరాబాద్: రాచకొండ పరిధిలో ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ దొంగిలిస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ మీడియాకు వివరాలను వెల్లడించారు. సహదేవ్, అభిమన్యు, నందు లాల్ అనే ముగ్గురిని అరెస్టు చేశామని తెలిపారు. ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ నుంచి జీవనోపాధికి ఇక్కడికి వచ్చి చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు సరిపోక దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
నగర శివారు ప్రాంతాలు వ్యవసాయ బావుల వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్లే టార్గెట్ చేస్తారని వెల్లడించారు. 9 మంది సభ్యుల ముఠాలో ముగ్గురు అరెస్టు కాగా మిగతావారు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరిపై ఇప్పటివరకు 173 కేసులు ఉన్నాయని, అందులో 83 కేసులు ఫస్ట్ టైం డిటెక్ట్ చేశామని చెప్పారు. వీరి వద్ద నుంచి 60 కేజీల కాపర్, లక్ష రూపాయల నగదు, దొంగిలించిన సొమ్ముతో కొన్న ఇండికా కార్, పల్సర్ బైక్ సీజ్ చేశామని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఈ ముఠా సభ్యులు 306 ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేశారని తెలిపారు. ఒక ట్రాన్స్ ఫార్మర్ లోని కాపర్ తీసి లక్ష రూపాయలకు అమ్ముతున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ కి భారీ నష్టం వాటిల్లిందన్నారు. పంట సమయంలో ఈ ముఠా వల్ల రైతులు కూడా చాలా నష్టపోయారని వెల్లడించారు. రాచకొండ, సైబరాబాద్, వికారాబాద్, సిద్దిపేట, నల్గొండ ప్రాంతంలో ఈ ముఠా దొంగతనం చేశారని చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







