బెంగళూర్‌లో రెండో రోజు ప్రధాని రోడ్‌ షో..

- May 07, 2023 , by Maagulf
బెంగళూర్‌లో రెండో రోజు ప్రధాని రోడ్‌ షో..

బెంగళూరు:  కర్ణాటకలో వరుసగా రెండో రోజు ప్రధాని మోడీ రోడ్‌షో నిర్వహించారు. శనివారం నగరంలో సుమారు 26 కి.మీ మేర రోడ్‌ షో నిర్వహించిన సంగతి తెలిసిందే.   ఆదివారం  మరో 10 కి.మీ మేర రోడ్‌ షో కొనసాగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  ఆదివారం నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ( NEET ) పరీక్ష దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రోడ్‌షోను కుదించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

ఆదివారం ఉదయం 10 గంటలకు న్యూ తిప్పసాంద్ర రోడ్‌ లోని కెంపేగౌడ విగ్రహం నుంచి రోడ్‌ షో ప్రారంభమైంది. కెంపేగౌడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం సెంట్రల్‌ బెంగళూర్‌ 5 నియోజకవర్గాలను టచ్‌ చేస్తూ ప్రధాని రోడ్‌ షో కొనసాగుతోంది. ప్రధాని వెంట కర్ణాటక రాజ్యసభ సభ్యుడు, కేంద్ర సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, బెంగళూరు సెంట్రల్‌ ఎంపి పీసీ మోహన్‌లు ఉన్నారు. ఆదివారం రోడ్‌ షో ముగిసిన అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు బహిరంగ సభల్లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. మే 10న కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com