బెంగళూర్లో రెండో రోజు ప్రధాని రోడ్ షో..
- May 07, 2023
బెంగళూరు: కర్ణాటకలో వరుసగా రెండో రోజు ప్రధాని మోడీ రోడ్షో నిర్వహించారు. శనివారం నగరంలో సుమారు 26 కి.మీ మేర రోడ్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదివారం మరో 10 కి.మీ మేర రోడ్ షో కొనసాగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( NEET ) పరీక్ష దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రోడ్షోను కుదించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
ఆదివారం ఉదయం 10 గంటలకు న్యూ తిప్పసాంద్ర రోడ్ లోని కెంపేగౌడ విగ్రహం నుంచి రోడ్ షో ప్రారంభమైంది. కెంపేగౌడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం సెంట్రల్ బెంగళూర్ 5 నియోజకవర్గాలను టచ్ చేస్తూ ప్రధాని రోడ్ షో కొనసాగుతోంది. ప్రధాని వెంట కర్ణాటక రాజ్యసభ సభ్యుడు, కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బెంగళూరు సెంట్రల్ ఎంపి పీసీ మోహన్లు ఉన్నారు. ఆదివారం రోడ్ షో ముగిసిన అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు బహిరంగ సభల్లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. మే 10న కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







