చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
- May 07, 2023
న్యూ ఢిల్లీ: పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లి 46 బంతుల్లో 55 పరుగులు చేశాడు. వ్యక్తిగత స్కోరు 12 పరుగుల వద్ద ఐపీఎల్(IPL)లో ఏడువేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా అవతరించాడు. ఈ ఘనతను అతడు తన సొంత మైదానంలో అందుకోవడం విశేషం. విరాట్ 233 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించాడు. ఐదు శతకాలు, 49 అర్ధశతకాలు కోహ్లి ఖాతాలో ఉన్నాయి.
ఇప్పటికే ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అతడి తరువాత శిఖర్ ధావన్(6536), డేవిడ్ వార్నర్(6189), రోహిత్ శర్మ(6063) లు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







