రస్ అల్ ఖైమాలో పర్వతం నుండి పడి ఎమిరాతి మృతి
- May 08, 2023
యూఏఈ: రస్ అల్ ఖైమాలో పర్వతం నుండి పడి ఓ ఎమిరాతి పౌరుడు మరణించాడు. స్థానిక అరబ్ మీడియా ప్రకారం.. ఓ ఎమిరాతి వ్యక్తి విహారయాత్రకు వెళ్ళాడు. కానీ ఎంతకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని బంధువులు, ఇతర స్థానికులు తప్పిపోయినట్లు అధికారులకు సమాచారం అందించారు. అల్ రామ్లోని సమగ్ర పోలీసు కేంద్రంతో పాటు సెర్చ్, రెస్క్యూ, జాతీయ అంబులెన్స్ విభాగానికి చెందిన సభ్యులతో సెర్చ్ ఆపరేషన్ ను రస్ అల్ ఖైమాలోని అధికారులు చేపట్టారు. కొంతమంది స్థానికులు కూడా ఇందులో పాల్గొన్నారు. కాగా, పర్వతం నుంచి పడి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







