రస్ అల్ ఖైమాలో పర్వతం నుండి పడి ఎమిరాతి మృతి

- May 08, 2023 , by Maagulf
రస్ అల్ ఖైమాలో పర్వతం నుండి పడి ఎమిరాతి మృతి

యూఏఈ: రస్ అల్ ఖైమాలో పర్వతం నుండి పడి ఓ ఎమిరాతి పౌరుడు మరణించాడు. స్థానిక అరబ్ మీడియా ప్రకారం.. ఓ ఎమిరాతి వ్యక్తి విహారయాత్రకు వెళ్ళాడు. కానీ ఎంతకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని బంధువులు, ఇతర స్థానికులు తప్పిపోయినట్లు అధికారులకు సమాచారం అందించారు. అల్ రామ్‌లోని సమగ్ర పోలీసు కేంద్రంతో పాటు సెర్చ్, రెస్క్యూ, జాతీయ అంబులెన్స్ విభాగానికి చెందిన సభ్యులతో సెర్చ్  ఆపరేషన్ ను రస్ అల్ ఖైమాలోని అధికారులు చేపట్టారు. కొంతమంది స్థానికులు కూడా ఇందులో పాల్గొన్నారు. కాగా, పర్వతం నుంచి పడి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com