1.2 మిలియన్లకు పైగా యాంఫేటమిన్ మాత్రలు సీజ్
- May 08, 2023
రియాద్: రియాద్లోని అల్-ముజాహ్మియా గవర్నరేట్లోని రెస్ట్ హౌజ్ లో 1.2 మిలియన్లకు పైగా యాంఫెటమైన్ మాత్రలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా విభాగ ప్రత్యేక ప్రతినిధి మాట్లాడుతూ.. విశ్రాంతి గృహంపై దాడి చేసి 7 మందిని అరెస్టు చేశామని, వారి వద్ద నుంచి దాదాపు 1,266,000 నార్కోటిక్ యాంఫెటమైన్ టాబ్లెట్లను గుర్తించి సీజ్ చేశామన్నారు.7 మంది నిందితులలో ఈజిప్టు, సిరియన్, బంగ్లాదేశ్ దేశాల ప్రవాసులు ఉన్నారని, అలాగే ఇద్దరు యెమెన్లతో పాటు ఇద్దరు సౌదీ పౌరులు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. నిందితులను అరెస్టు చేసి, వారిపై ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, ఆ తర్వాత వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించామని ప్రతినిధి తెలిపారు. సౌదీ అరేబియా యువత భద్రతను లక్ష్యంగా చేసుకున్న డ్రగ్స్ స్మగ్లింగ్, ప్రమోషన్ నెట్వర్క్లపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నేపాల్లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







