Dhs1,500 కంటే తక్కువ జీతం..కార్మికులకు కంపెనీలే వసతి కల్పించాలి..!
- May 08, 2023
యూఏఈ: 50 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నట్లయితే.. వారి వేతనాలు Dhs1,500 లేదా అంతకంటే తక్కువ ఉంటే.. కార్మికులకు ఆయా కంపెనీలే తప్పనిసరిగా వసతి కల్పించాలని మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MOHRE) స్పష్టం చేసింది. సామూహిక కార్మిక గృహాలకు సాధారణ ప్రమాణాలు, అన్ని సేవలను అందించాలని ఆదేశించింది. MOHRE ప్రకారం, 500 కంటే తక్కువ మంది కార్మికులకు కేటాయించిన వసతి ప్రమాణాలకు స్థాపనలు కట్టుబడి ఉండాలి.
లేబర్ రిలేషన్స్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం.. యజమానులు తప్పక బహిర్గతమయ్యే ప్రమాదాలు లేదా గాయాలు, వృత్తిపరమైన వ్యాధుల నుండి తగిన రక్షణ మార్గాలను అందించాలి. పని సమయంలో.. అగ్ని ప్రమాదాలు, యంత్రాల వాడకం వల్ల సంభవించే ప్రమాదాలు, మంత్రిత్వ శాఖ నిర్ణయించిన అన్ని ఇతర నివారణ పద్ధతులు, నిబంధనలలు పాటించాలని సూచించింది.
కార్మికులు వృత్తిలో చేరే ముందు వాటాలో ఉన్న ప్రమాదాలు, నష్టాల గురించి ముందే యజమానులు తప్పనిసరిగా వారికి తెలియజేయాలని, అరబిక్ కాకుండా కార్మికులు అర్థం చేసుకునే మరొక భాషలో సూచనలను, స్పష్టంగా కనిపించే ప్రదేశంలో పెట్టాలని సూచించింది. కంప్రెస్డ్ వాయువులు, విద్యుత్ ప్రమాదాల నుండి కార్మికులను రక్షించడానికి యజమానులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ప్రతి పారిశ్రామిక సదుపాయం, అలాగే 100 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేసే నిర్మాణ రంగంలో పనిచేస్తున్న సంస్థలు తప్పనిసరిగా వృత్తిపరమైన ఆరోగ్యానికి బాధ్యత వహించే అధికారిని నియమించాలని MOHRE పేర్కొంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









