నాలుగు ఇ-చెల్లింపు సేవలను ప్రారంభించిన KFCA
- May 08, 2023
దమ్మామ్: సౌదీ అరేబియా, బహ్రెయిన్ రెండు దేశాలకు వెళ్లేందుకు ఉన్న టోల్ గేట్లలో చెల్లించడానికి ప్రయాణికులను అనుమతించే 4 ఇ-చెల్లింపు సేవలను ప్రారంభించినట్లు కింగ్ ఫహద్ కాజ్వే అథారిటీ (KFCA) ప్రకటించింది. KFCA ఇంటిగ్రేటెడ్, ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ గేట్లను ఉపయోగించడం ద్వారా "Jesr" లేదా "కాజ్వే" యాప్ ద్వారా 4 ఇ-చెల్లింపు సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. ఇక ఆయా టోల్ గేట్లలో ప్రయాణికులు నగదు చెల్లింపుల కోసం ఆగాల్సిన అవసరం లేకుండానే చెల్లించి గేట్లను దాటవచ్చని అథారిటీ పేర్కొంది. బార్క్ టెక్నాలజీ, QR కోడ్ టెక్నాలజీ ద్వారా వాహనాల నంబర్ ప్లేట్లు, ప్రత్యేకమైన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID)ల సాయంతో యాపుల ద్వారా పేమెంట్ ప్రక్రియను క్షణాల్లో పూర్తిచేయవచ్చు. అదే విధంగా సౌదీ వైపున ఉన్న ప్రొసీజర్స్ ప్రాంతంలో ఉచిత వైఫై సేవను అందించనున్నట్లు KFCA ఇటీవల ప్రకటించింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







