నాలుగు ఇ-చెల్లింపు సేవలను ప్రారంభించిన KFCA
- May 08, 2023
దమ్మామ్: సౌదీ అరేబియా, బహ్రెయిన్ రెండు దేశాలకు వెళ్లేందుకు ఉన్న టోల్ గేట్లలో చెల్లించడానికి ప్రయాణికులను అనుమతించే 4 ఇ-చెల్లింపు సేవలను ప్రారంభించినట్లు కింగ్ ఫహద్ కాజ్వే అథారిటీ (KFCA) ప్రకటించింది. KFCA ఇంటిగ్రేటెడ్, ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ గేట్లను ఉపయోగించడం ద్వారా "Jesr" లేదా "కాజ్వే" యాప్ ద్వారా 4 ఇ-చెల్లింపు సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. ఇక ఆయా టోల్ గేట్లలో ప్రయాణికులు నగదు చెల్లింపుల కోసం ఆగాల్సిన అవసరం లేకుండానే చెల్లించి గేట్లను దాటవచ్చని అథారిటీ పేర్కొంది. బార్క్ టెక్నాలజీ, QR కోడ్ టెక్నాలజీ ద్వారా వాహనాల నంబర్ ప్లేట్లు, ప్రత్యేకమైన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID)ల సాయంతో యాపుల ద్వారా పేమెంట్ ప్రక్రియను క్షణాల్లో పూర్తిచేయవచ్చు. అదే విధంగా సౌదీ వైపున ఉన్న ప్రొసీజర్స్ ప్రాంతంలో ఉచిత వైఫై సేవను అందించనున్నట్లు KFCA ఇటీవల ప్రకటించింది.
తాజా వార్తలు
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!







