నాలుగు ఇ-చెల్లింపు సేవలను ప్రారంభించిన KFCA
- May 08, 2023
దమ్మామ్: సౌదీ అరేబియా, బహ్రెయిన్ రెండు దేశాలకు వెళ్లేందుకు ఉన్న టోల్ గేట్లలో చెల్లించడానికి ప్రయాణికులను అనుమతించే 4 ఇ-చెల్లింపు సేవలను ప్రారంభించినట్లు కింగ్ ఫహద్ కాజ్వే అథారిటీ (KFCA) ప్రకటించింది. KFCA ఇంటిగ్రేటెడ్, ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ గేట్లను ఉపయోగించడం ద్వారా "Jesr" లేదా "కాజ్వే" యాప్ ద్వారా 4 ఇ-చెల్లింపు సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. ఇక ఆయా టోల్ గేట్లలో ప్రయాణికులు నగదు చెల్లింపుల కోసం ఆగాల్సిన అవసరం లేకుండానే చెల్లించి గేట్లను దాటవచ్చని అథారిటీ పేర్కొంది. బార్క్ టెక్నాలజీ, QR కోడ్ టెక్నాలజీ ద్వారా వాహనాల నంబర్ ప్లేట్లు, ప్రత్యేకమైన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID)ల సాయంతో యాపుల ద్వారా పేమెంట్ ప్రక్రియను క్షణాల్లో పూర్తిచేయవచ్చు. అదే విధంగా సౌదీ వైపున ఉన్న ప్రొసీజర్స్ ప్రాంతంలో ఉచిత వైఫై సేవను అందించనున్నట్లు KFCA ఇటీవల ప్రకటించింది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!