యూఏఈలో దారుణం.. నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష
- May 11, 2023
యూఏఈ: యూఏఈలో ఒక బాలుడిపై అత్యాచారం, లైంగిక దాడులకు పాల్పడినందుకు ఒక వ్యక్తికి 20 సంవత్సరాల కంటే ఎక్కువ జైలుశిక్ష, Dh200,000 జరిమానా విధించారు. కల్బా పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిని జువైనల్ కోర్టుకు రిఫర్ చేసింది. అన్ని సాక్ష్యాలను పరిశీలించిన క్రిమినల్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం, బాధితురాలి తల్లికి నిందితుడు బంధువు. తన కుమారుడిపై లైంగికంగా దాడులు చేస్తున్నాడని గుర్తించింది. అతను 11 సంవత్సరాల వయస్సు నుండి అతనిపై "అనేక సార్లు" అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు బాధితుడిపై పలుమార్లు అత్యాచారం చేశాడని, తనపై ఫిర్యాదు చేయవద్దని బెదిరించాడని దర్యాప్తులో తేలింది. నిందితుడు డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలను వాడుతున్నట్లు కూడా తేలిందిని అని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ తల్లిదండ్రులు, కుటుంబాలు తమ పిల్లల వ్యవహారాలపై శ్రద్ధ వహించాలని, వారితో కమ్యూనికేట్ కావాలని, అన్ని రకాల హాని నుండి వారిని రక్షించడానికి నిరంతరం వారి మాటలు వినాలని సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...







