యూఏఈ జలాల్లో కిల్లర్ వేల్స్.. ఎక్కడ ఉన్నాయంటే?
- May 11, 2023
యూఏఈ: కిల్లర్ వేల్స్ యూఏఈ సముద్ర జలాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఈజిప్షియన్ నిర్వాసి అహ్మద్ అఫీఫీ, అతని తోటి జాలర్లు చేపట వేటకు వెళ్లిన సమయంలో వీటి సంచారాన్ని గుర్తించి.. అధికారులకు సమాచారం అందించారు. 2008 నుండి వీటి సంచారాన్ని యూఏఈ జలాల్లో చూడలేదని కొందరు జాలర్లు తెలిపారు. సముద్ర జలాల్లో ఇవి సంచరిస్తున్న వీడయోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అవి హిందూ మహాసముద్రం నుండి వచ్చాయని.. అరేబియా సముద్రం, ఒమన్ సముద్రంలోకి వెళ్లి, ఆపై గల్ఫ్కు వెళ్లే అవకాశం ఉందని జస్ట్ ఫిషింగ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, కో-ఫౌండర్ అఫీఫీ తెలిపారు.తొలుత జెబెల్ అలీలో.. ఆ తరువాత షార్జాలో కనిపించాయన్నారు. ఇప్పుడు దుబాయ్, అబుధాబి సముద్ర జలాల్లో అవి చక్కర్లు కొడుతున్నాయని పేర్కొన్నారు.
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఎమిరేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా బుధవారం దుబాయ్ జలాల్లో వేల్స్ సంచరిస్తున్న వీడియోను షేర్ చేశారు. దాంతో తీరంలో తిమింగలాలు కనిపించడంతో బీచ్లకు వెళ్లే వారికి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు యూఏఈలో ఈ దృశ్యం దేశ ఆరోగ్యకరమైన సముద్ర వాతావరణానికి నిదర్శనమని అఫీఫీ అన్నారు. ఉదాహరణకు, అబుధాబిలోని జలాలు కింగ్ఫిష్, గ్రూపర్స్, గోల్డెన్ ట్రెవల్లీ, కోబియాలతో నిండి ఉన్నాయి. నెట్-ఫిషింగ్, బోనులను నిషేధించిన తర్వాత వీటి సంఖ్య పెరిగినట్లు కనిపిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







