ఉమ్రా యాత్రికుల వీసా గడవు పొడిగింపు.. ప్రత్యేక హోస్టింగ్ పథకం ప్రారంభం
- May 11, 2023
సౌదీ: సూడాన్లో కొనసాగుతున్న సంఘర్షణతో ప్రభావితమైన యాత్రికులకు మద్దతుగా కొత్త కార్యక్రమాలను సౌదీ అరేబియా అధికారులు ప్రకటించారు. ఇప్పుడు, ఈ సందర్శకులు రాజ్యంలో ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్లు సుడానీస్ యాత్రికులకు మంజూరు చేయబడిన వీసాల చెల్లుబాటును పొడిగించే విధానాలను ప్రారంభించాయి. మక్కా రీజియన్ అడ్మినిస్ట్రేషన్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో కొత్త పథకానికి సంబంధించిన విషయాలను పేర్కొన్నారు.
బాధిత యాత్రికులు ఆన్లైన్ అబ్షర్ ప్లాట్ఫారమ్లో ప్రత్యేక 'హోస్టింగ్' సేవ కింద దరఖాస్తు చేసుకోవాలి. ఈ సేవ ద్వారా పౌరులు, ప్రవాసులు సుడానీస్ జాతీయులకు హోస్ట్లుగా పని చేయవచ్చు. యాత్రికుల ఉమ్రా వీసాలను "కుటుంబ సందర్శన వీసాలు లేదా వ్యక్తిగత"గా మార్చుకోవచ్చు. అయితే కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. ఈ పథకం నుండి ప్రయోజనం పొందాలనుకునే వారు అబ్షర్ వెబ్సైట్ను మరిన్ని వివరాల కోసం చూడాలని పాస్పోర్ట్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







