ఉమ్రా యాత్రికుల వీసా గడవు పొడిగింపు.. ప్రత్యేక హోస్టింగ్ పథకం ప్రారంభం
- May 11, 2023సౌదీ: సూడాన్లో కొనసాగుతున్న సంఘర్షణతో ప్రభావితమైన యాత్రికులకు మద్దతుగా కొత్త కార్యక్రమాలను సౌదీ అరేబియా అధికారులు ప్రకటించారు. ఇప్పుడు, ఈ సందర్శకులు రాజ్యంలో ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్లు సుడానీస్ యాత్రికులకు మంజూరు చేయబడిన వీసాల చెల్లుబాటును పొడిగించే విధానాలను ప్రారంభించాయి. మక్కా రీజియన్ అడ్మినిస్ట్రేషన్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో కొత్త పథకానికి సంబంధించిన విషయాలను పేర్కొన్నారు.
బాధిత యాత్రికులు ఆన్లైన్ అబ్షర్ ప్లాట్ఫారమ్లో ప్రత్యేక 'హోస్టింగ్' సేవ కింద దరఖాస్తు చేసుకోవాలి. ఈ సేవ ద్వారా పౌరులు, ప్రవాసులు సుడానీస్ జాతీయులకు హోస్ట్లుగా పని చేయవచ్చు. యాత్రికుల ఉమ్రా వీసాలను "కుటుంబ సందర్శన వీసాలు లేదా వ్యక్తిగత"గా మార్చుకోవచ్చు. అయితే కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. ఈ పథకం నుండి ప్రయోజనం పొందాలనుకునే వారు అబ్షర్ వెబ్సైట్ను మరిన్ని వివరాల కోసం చూడాలని పాస్పోర్ట్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ