ఉమ్రా యాత్రికుల వీసా గడవు పొడిగింపు.. ప్రత్యేక హోస్టింగ్ పథకం ప్రారంభం
- May 11, 2023
సౌదీ: సూడాన్లో కొనసాగుతున్న సంఘర్షణతో ప్రభావితమైన యాత్రికులకు మద్దతుగా కొత్త కార్యక్రమాలను సౌదీ అరేబియా అధికారులు ప్రకటించారు. ఇప్పుడు, ఈ సందర్శకులు రాజ్యంలో ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్లు సుడానీస్ యాత్రికులకు మంజూరు చేయబడిన వీసాల చెల్లుబాటును పొడిగించే విధానాలను ప్రారంభించాయి. మక్కా రీజియన్ అడ్మినిస్ట్రేషన్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో కొత్త పథకానికి సంబంధించిన విషయాలను పేర్కొన్నారు.
బాధిత యాత్రికులు ఆన్లైన్ అబ్షర్ ప్లాట్ఫారమ్లో ప్రత్యేక 'హోస్టింగ్' సేవ కింద దరఖాస్తు చేసుకోవాలి. ఈ సేవ ద్వారా పౌరులు, ప్రవాసులు సుడానీస్ జాతీయులకు హోస్ట్లుగా పని చేయవచ్చు. యాత్రికుల ఉమ్రా వీసాలను "కుటుంబ సందర్శన వీసాలు లేదా వ్యక్తిగత"గా మార్చుకోవచ్చు. అయితే కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. ఈ పథకం నుండి ప్రయోజనం పొందాలనుకునే వారు అబ్షర్ వెబ్సైట్ను మరిన్ని వివరాల కోసం చూడాలని పాస్పోర్ట్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







