ఫేక్ యాడ్స్, లింకుల పట్ల జాగ్రత్త..!
- May 12, 2023
షార్జా: ప్రసిద్ధ కంపెనీల లోగోను కలిగి ఉన్న ఫేక్ యాడ్స్, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని షార్జా పోలీసులు హెచ్చరించారు.తప్పుడు ప్రకటనలు, ప్రమోషన్ పద్ధతులను ఉపయోగించి సోషల్ మీడియా ద్వారా ఇటీవల వ్యాప్తి చెందుతున్న ఎలక్ట్రానిక్ మోసాల గురించి ప్రజలు, నివాసితులలో అవగాహన పెంచేలా ప్రకటనను విడుదల చేసింది. ఫేక్ రాయితీలు, ప్రమోషన్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని, ముఖ్యంగా వ్యక్తిగత ధృవీకరణ నంబర్ (OTP) ను చెప్పవద్దని సూచించారు. అధికారిక పేరు లేదా లోగోను కలిగి ఉన్నప్పటికీ, ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఓటిపి వెల్లడించవద్దని షార్జా పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రహస్య కోడ్ ను ఏ బ్యాంక్, సంస్థ అడగదని తెలిపారు. మోసానికి గురైనప్పుడు (8002626) నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







