ఫేక్ యాడ్స్, లింకుల పట్ల జాగ్రత్త..!
- May 12, 2023
షార్జా: ప్రసిద్ధ కంపెనీల లోగోను కలిగి ఉన్న ఫేక్ యాడ్స్, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని షార్జా పోలీసులు హెచ్చరించారు.తప్పుడు ప్రకటనలు, ప్రమోషన్ పద్ధతులను ఉపయోగించి సోషల్ మీడియా ద్వారా ఇటీవల వ్యాప్తి చెందుతున్న ఎలక్ట్రానిక్ మోసాల గురించి ప్రజలు, నివాసితులలో అవగాహన పెంచేలా ప్రకటనను విడుదల చేసింది. ఫేక్ రాయితీలు, ప్రమోషన్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని, ముఖ్యంగా వ్యక్తిగత ధృవీకరణ నంబర్ (OTP) ను చెప్పవద్దని సూచించారు. అధికారిక పేరు లేదా లోగోను కలిగి ఉన్నప్పటికీ, ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఓటిపి వెల్లడించవద్దని షార్జా పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రహస్య కోడ్ ను ఏ బ్యాంక్, సంస్థ అడగదని తెలిపారు. మోసానికి గురైనప్పుడు (8002626) నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







